కివీస్ తో జరిగిన రెండో వన్డేలో భారత క్రికెటర్ మిథాలీరాజ్ అరుదైన రికార్డులు సాధించింది. తన కంటే 21 ఏళ్ల చిన్నదైన రిచాఘోష్తో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది. మిథాలీ మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన 4ఏళ్లకు రిచా జన్మించింది. అలాగే 20ఏళ్ల కెరీర్ పూర్తయిన మొదటి మహిళా క్రికెటర్, కివీస్పై అత్యధిక హాఫ్ సెంచరీలు, రన్స్ చేసిన భారత కెప్టెన్ రికార్డులు నెలకొల్పింది. ధోనీ, కోహ్లి రికార్డులను బద్దలుకొట్టింది.
Read More »టీమిండియాపై న్యూజిలాండ్ మహిళల జట్టు ఘనవిజయం
క్వీన్స్టౌన్ వేదికగా ఇండియాతో జరిగిన రెండవ వన్డేలో న్యూజిలాండ్ మహిళల జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. క్వీన్స్టౌన్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియన్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 270 రన్స్ చేసింది. మిథాలీ రాజ్, రిచా ఘోష్లో హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. మిథాలీ తన కెరీర్లో 61వ హాఫ్ సెంచరీ నమోదు చేసింది. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన కివీస్ జట్టు …
Read More »టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్
టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్ ను ప్రకటిస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తాను సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని దాదా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ నేరుగా బోర్డు అధ్యక్షుడిని కాలేదన్నారు. 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరవ్ గంగూలీ సూచించారు.
Read More »హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన పదవీకాలం వచ్చే జూన్ నెల నాటికి ముగుస్తుంది.. దాన్ని సుదీర్ఘకాలం పొడిగించాలని లాంగర్ కోరినా బోర్డు అందుకు ససేమిరా అన్నది. దీంతో మనస్తాపంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జట్టులో కొందరు ఆటగాళ్లతోనూ లాంగర్కు విభేదాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, ఆయన స్థానంలో ఆండ్రూ మెక్డొనాల్డ్స్ కొత్త హెడ్కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Read More »ఫిబ్రవరి12న కివీస్ తో మహిళా టీమిండియా వన్డే సమరం
మరోవారం రోజుల్లో మహిళా జట్టులైన టీమిండియా-కివీస్ జట్ల మధ్య సవరించిన క్రికెట్ షెడ్యూల్ ప్రకారమే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్నది. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున మొదటి వన్డే మ్యాచ్ మొదలు కానున్నది. ఈ పర్యటనలో భాగంగా ఏకైక టీ20తో పాటు ఐదు వన్డే మ్యాచులు జరగనున్నాయి. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈనెల పదకొండో తారీఖున మొదలు కానున్న ఈ సిరీస్ …
Read More »కుమ్మేసిన యువభారతం
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్లో యువ భారత్ అదరగొట్టింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 96 పరుగుల ఘన విజయంతో ఫైనల్కు దూసుకెళ్లింది. టీమిండియా నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలా పడింది. 41.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో యువ భారత్ 96 పరుగులతో విజయకేతనం ఎగరవేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు శుభారంభం …
Read More »సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టిన పావెల్
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. 225 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 204/9 రన్స్ చేసింది. విండీస్ 20 పరుగుల తేడాతో గెలిచింది. వెస్టిండీస్ బ్యాటర్ పావెల్ సెంచరీ (53 బంతుల్లో 107)తో అదరగొట్టాడు. ఇందులో 10 సిక్సర్లు, 4 ఫోర్లు ఉండటం విశేషం. పూరన్ 70 రన్స్ చేశాడు. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో విండీస్ …
Read More »వెస్టిండీస్ తో జరిగే టీ20 సిరీస్ కు టీమిండియా జట్టు ఇదే
వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే టీ20 జట్టును బీసీసీఐ ప్రకటించిందిటీ20 టీం: రోహిత్ శర్మ (C), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (WK), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్, భువనేశ్వర్, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్.బుమ్రా, షమీకి వన్డే, టీ20లకు విశ్రాంతి. …
Read More »వెస్టిండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియా జట్టు ఇదే
వచ్చే నెలలో వెస్టిండీస్ తో జరిగే వన్డే, టీ20 టీంలను బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యులను సెలెక్ట్ చేసింది.వన్డే టీం: రోహిత్ శర్మ (C), కేఎల్ రాహుల్ (VC), రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సూర్య కుమార్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (WK), దీపక్ చాహర్, శార్దుల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, సిరాజ్, …
Read More »బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు
విరాట్ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతుగా నిలిచారు. ‘అభిమానులు వరల్డ్ కప్ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ర్యాంకులు, సిరీస్ల గురించి కాదు. అందుకే కోహ్లి ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ ట్రోఫీ నెగ్గకపోవడమే కోహ్లిపై వేటుకు కారణం. బీసీసీఐ అతడిని తప్పించి రోహిత్ పగ్గాలు అప్పగించడం సరైందే’ అని ఆయన అన్నారు.
Read More »