ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ పత్రికపై వేసిన పరువు నష్టం కేసులో వెస్డిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ విజయం సాధించాడు. గేల్ పరువుకు నష్టం కలిగించినందుకు దాదాపు కోటిన్నర రూపాయలు చెల్లించాలని న్యూసౌత్ వేల్స్ న్యాయస్థానం తీర్చు ఇచ్చింది. 2015 వరల్డ్ కప్ సందర్భంగా సిడ్నీ స్టేడియంలోని డ్రెస్సింగ్ రూమ్ లోకి మసాజ్ చేయడానికి వచ్చిన మహిళ పట్ల గేల్ అసభ్యం గా ప్రవర్తించాడని ఫెయిర్ఫాక్స్ పత్రిక కథనం …
Read More »తమిళనాడులో 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్..
జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేసింది. తేని, మధురై, పెరంబలూరు, తిరునెల్వేలి, రామనాథపురంలలో ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. బృందాలుగా విడిపోయి విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ 14 మంది తమిళ ముస్లింలు గతంలో దుబాయ్ లో ఉండేవారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వీరిని సొంత రాష్ట్రం తమిళనాడుకు పంపించింది …
Read More »బాబు పిటిషన్పై ముగిసిన వాదనలు..
తనకు జడ్ ప్లస్ కేటగిరి కింద భద్రత కొనసాగించాలని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. రాజకీయ కారణాలతో చంద్రబాబుకు భద్రత తగ్గించారని ఆయన తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత తగ్గించారని తెలిపారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ …
Read More »బాలీవుడ్ భామపై కేసు నమోదు..అసలు కారణం ఇదే ?
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ పై కేసు నమోదైంది. అమీషా పటేల్ తనకిచ్చిన రూ.3 కోట్ల చెక్ బౌన్స్ అయిందని నిర్మాత అజయ్ కుమార్ సింగ్ రాంఛీ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ‘దేశీ మ్యాజిక్’ సినిమా నిర్మాణం కోసం అమీషా పటేల్ రూ.2.5 కోట్లు తీసుకుంది. ఆ తర్వాత అమీషా ఇచ్చిన చెక్కు బౌన్స్ అయింది. గతేడాది సినిమా కోసం నా దగ్గరి నుంచి తీసుకున్న డబ్బు …
Read More »రవి ప్రకాశ్ అరెస్ట్..?
ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ–9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు నేడు ఆఖరు గడువు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం.. 9, 11వ తేదీల్లో సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండుసార్లు కూడా రవిప్రకాశ్ విచారణకు హాజరు కాలేదు. దీంతో సోమవారం మరో సారి సీఆర్పీసీ సెక్షన్ 41–ఏ ప్రకారం నోటీసులు జారీ చేశారు. …
Read More »కలర్స్ సంస్థకు వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని 9 శాతం వడ్డీతో..సినితారలు జాగ్రత్త
సీనియర్ హీరోయిన్లు రంభ, రాశి 90 దశకంలో ఓ వెలుగు వెలిగారు. గ్లామర్ బ్యూటీగా రంభ, హోమ్లీ హీరోయిన్ గా రాశి తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. రంభ అయితే 2000 తర్వాత కూడా నటించింది. కొన్ని ఐటెం సాంగ్స్ కూడా చేసింది. వివాహం తర్వాత వీరిద్దరూ వెండితెరపై కనిపించడం బాగా తగ్గించారు. అయితే తాజాగా రాశి, రంభ ప్రసార మాద్యమాల్లో కలర్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రకటనలను …
Read More »న్యాయవ్యవస్థను రోడ్డు మీద పడేసిన అధికార ప్రభుత్వం..
సత్తెనపల్లి లో న్యాయవాది గుమస్తాలుగా విధులు నిర్వహిస్తున్న వారు సుమారు 50 మంది ఈ రోజు రోడ్ ఎక్కి, నిరాహారదీక్ష చేపట్టి తమ బాధలను చెప్పుకుంటున్నారు.ప్రభుత్వం మాకు ఇచ్చే పైకముతో మేము చాలీ, చాలని ఆదాయం తో కుటుంబాన్ని పోషించాలంటే చాలా కష్టం గా ఉంది, మాకు జీత భత్యాలు పెంచమని ,అదే విధంగా సదరు యాక్ట్ 13/1992 ప్రకారం డెత్ బెనిఫిట్ కింద 2 లక్షల నుంచి 3 …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అనితపై క్రిమినల్ కేసు..కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ
ఏపీలో టీడీపీ నేతల బాగోతాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చెక్కు బౌన్స్ కేసు కింద కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయని వేగి శ్రీనివాసరావు అనే దివ్యాంగ కాంట్రాక్టర్ తెలిపారు. వీజేఎఫ్ ప్రెస్క్లబ్లో శుక్రవారం విలేకరులతో ఆయన తన గోడు వెళ్లబోసుకున్నారు . విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం రాజుపేటకు చెందిన శ్రీనివాసరావు సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే అనిత …
Read More »పాక్ తొలి హిందూ మహిళా జడ్జి సుమన్ కుమారి
పాకిస్తాన్ లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్ కుమారి నిలిచారు.ఖంబర్-షాదాద్కోట్ కు చెందిన ఆమె తన సొంత జిల్లాలోనే సివిల్ జడ్జిగా భాద్యతలు నిర్వర్తించనున్నారు.హైదరాబాద్లో ఎల్ఎల్బీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆమె కరాచీలోని షాబిస్త్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. పాక్లో తొలిసారిగా హిందువుల్లో జస్టిస్ రాణా భగవాన్దాస్ జడ్జిగానియమించగా 2005 నుండి 2007 మధ్య స్వల్ప కాల వ్యవధుల్లో ప్రధాన న్యాయమూర్తిగా కూడా …
Read More »కోర్టు ప్రాంగణంలోనే చేనిపోయిన జడ్జి ఐశ్వర్య
నరసరావుపేట కోర్టు ప్రాంగణంలో ఒకటైన ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐశ్వర్య (25) హఠాన్మరణం చెందారు. ఈ వార్త ఒక్కసారిగా తెలియటంతో న్యాయవాదులు కోర్టు ప్రాంగణానికి తరలివస్తున్నారు.ఆమె కోర్టు బంగళా లోని నివసిస్తున్నారు. ఆమె కు ఇంకా పెళ్ళి కాలేదు తల్లిదండ్రుల తో కలిసి ఉంటున్నారు. నిన్న అనుకోని విధంగా ఇంటిలో జారిపడినట్లు తెలిసింది. ఒకింత అస్వస్థతకు గురికావడంతో నిన్న కోర్టు కు కుడా సెలవు పెట్టారని తెలిసింది. …
Read More »