కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఉన్న లుకలుకలు చాలవన్నట్లు కొత్తగా మరికొన్ని సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆ పార్టీ అధిష్ఠానం తీర పట్ల ఇప్పటికే విసిగిపోయిన కాంగ్రెస్శ్రేణులకు కొత్త తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గుజరాత్లో ఆ పార్టీకి ఈ సమస్యల తీవ్రత మరింత ఎక్కువైంది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న హార్దిక్ పటేల్ లేటెస్ట్గా చేసిన కామెంట్స్ పరిస్థితి తీవ్రతకి అద్దంపడుతున్నాయి. ఇటీవల ఓ నేషనల్ మీడియా సంస్థతో హార్దిక్ పటేల్ మాట్లాడుతూ …
Read More »అయ్యో దిగ్విజయ్.. ఆ ఫొటో పెట్టి దొరికేశావా!
తరచూ తన కామెంట్లతో వివాదాస్పదమయ్యే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఈసారి ఫేక్ ఫొటోను ట్విటర్ల పోస్ట్ చేసి వివాదాస్పదమయ్యారు. ఈరోజు ఉదయం దిగ్విజయ్ తన ట్విటర్ అకౌంట్ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ‘ఆదివారం ఖర్గోవ్లో జరిగిన మతపరమైన హింస సమయంలో తీసిన ఫొటో’ అంటూ దానికి క్యాప్షన్ పెట్టారు. మసీదుపై కొంతమంది యువకులు కాషాయ జెండా పెడుతున్నట్లుగా ఉన్న ఆ …
Read More »డీకే శివకుమార్ ఛాలెంజ్.. కేటీఆర్ కౌంటర్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్ సీఈవో రవీష్ నరేష్ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని.. రోజూ పవర్కట్లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్ నరేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్పై కేటీఆర్ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని పేర్కొన్నారు. …
Read More »‘లిక్కర్ మత్తులో జోగుతోంది కాంగ్రెస్, బీజేపీ నేతల పిల్లలే’
బంజారాహిల్స్ పబ్లో డ్రగ్స్ దొరికిన ఘటనలో చేపట్టిన చర్యలు ప్రభుత్వం, పోలీసుల పనితీరుకి నిదర్శనమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. డ్రగ్స్ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే పబ్పై పోలీసులు ఎందుకు దాడి చేస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. ఈ వ్యవహారంలో నిందితుల కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారని చెప్పారు. రాష్ట్రంలో పేకాట …
Read More »NTR తొలి అడుగే ఓ ప్రభంజనం – TDP 40ఏళ్ళ ప్రస్థానానికి తొలి అడుగు పడింది అక్కడే..!
దివంగత మాజీ ముఖ్యమంత్రి,తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాలుగా ఇటు అప్పటి ఉమ్మడి ఏపీని అటు దేశాన్ని పాలిస్తున్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా హైదరాబాద్ మహానగరంలోని ప్రస్తుతం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ సాక్షిగా తెలుగు దేశం పార్టీ పెట్టనున్నట్లు ప్రకటన చేశారు. తెలుగు వాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం …
Read More »రేవంత్.. ఫ్యూచర్లో నీకు ఝలక్ ఇస్తా చూడు: జగ్గారెడ్డి
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితోనే తనకు పంచాయితీ అని.. కాంగ్రెస్తో కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజాలను నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడటం తన స్వభావమని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డితో ఉన్న విభేదాలపై చెప్పారు. ‘ఇది మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. మెదక్ పర్యటనకు రేవంత్ వెళ్తే నాకు చెప్పలేదు. నాకు పిలవకపోవడంతో కోపం వచ్చింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అలాంటి వ్యక్తికి …
Read More »ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ!
హైదరాబాద్: ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని ఆయన పునరుద్ఘాటించాఉ. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలన బాగాలేదనే …
Read More »ఆ ప్రచారం కరెక్ట్ కాదు..: చినజీయర్ స్వామి
విజయవాడ: కొత్తగా ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయని.. తామెప్పుడూ ఆదివాసీలు, మహిళలను చిన్నచూపు చూడలేదని చినజీయర్ స్వామి అన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. చినజీయర్ స్వామి క్షమాపణలు చెప్పాలంటూ తెలంగాణలో పలుచోట్ల నిరసనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఏదైనా విషయాన్ని విన్నప్పుడు ఆ వ్యాఖ్యల ముందు వెనుక ఏం జరిగిందన్నది …
Read More »రాజ్యసభకు భజ్జీ..?
ఇటీవల విడుదలైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన టీమిండియా సీనియర్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే జలంధర్ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించే అవకాశం కనిపిస్తున్నాయి.. అయితే ఈ అంశంపై త్వరలోనే …
Read More »కాంగ్రెస్లో ప్రకంపనలు.. 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్లపై సోనియా వేటు
దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టించేలా ఉన్నాయి. ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించింది. పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్దూ సహా మిగతా నాలుగు రాష్ట్రాల అధ్యక్షులు రాజీనామాలు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ …
Read More »