భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణ లోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమీటీల’’ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని సిఎం తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ …
Read More »జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి -సీఎం కేసీఆర్
ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్ను కోరారు. వారి విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. జూన్ 3 నుంచి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించాలని సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం …
Read More »తీన్మార్ మల్లన్నపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా
చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై 10 కోట్లకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు.ఈ మేరకు తన న్యాయవాది చేత మల్లన్నకు మంత్రి అజయ్ నోటీసులు పంపించారు. మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధారమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలనే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన ఛానల్, పత్రికలో అబద్ధాలు చెప్పారని నోటీసుల్లో …
Read More »అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు
దేశంలోనే అత్యధిక మత్స్యకార సొసైటీలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,793 మత్స్య సొసైటీలు ఉండగా, కొత్తగా మరో 1,177 సొసైటీలు ఏర్పాటుచేస్తున్నారు. దీంతో మొత్తం సొసైటీల సంఖ్య 5,970కి పెరగనున్నది. మత్స్య సంపదకు ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలో 3,315 సొసైటీలు ఉండగా ఏపీలో 2,347 సొసైటీలు ఉన్నాయి. రాష్ట్రంలోని మత్స్య సొసైటీల్లో దాదాపు 3.75 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఉచిత …
Read More »టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజకు అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా మహిళా జాతీయ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచినందుకు శ్రీజను, అలాగే కోచ్ సోమనాథ్ ఘోష్ను మంత్రి కేటీఆర్ అభినందించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు అవసరమైన ప్రయాణ, సామగ్రి సహా అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.యూకేలోని బర్మింగ్హామ్లో జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఆకుల భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నది.
Read More »కేంద్ర మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ దమ్మున్న సవాల్
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా టీఆర్ఎస్ ప్రభుత్వంపై,సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు కూడా చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై రాష్ట్ర మంత్రి,టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో …
Read More »తెలంగాణలో మరో కొలువుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో భారీ మొత్తంలో ‘విద్యుత్తు’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వెయ్యి జూనియర్ లైన్మెన్, 201 సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఆదివారం నోటిఫికేషన్ జారీచేసింది. జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ నెల 19 నుంచి దరఖాస్తులు స్వీకరించనుండగా, జూన్ 17న రాత పరీక్ష నిర్వహిస్తారు. సబ్ ఇంజినీర్ పోస్టులకు జూన్ 15 నుంచి దరఖాస్తులు స్వీకరించి, జూలై 31న రాత …
Read More »అమిత్ షా.. టూరిస్టులా వచ్చిపోతామంటే కుదరదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించాలని, విభజన హామీలను నెరవేర్చాలని సబిత డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ ఎల్పీలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ లతో కలిసి …
Read More »చిన్నగూడూరు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిన్నగూడూరు గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఈ సందర్భంగా అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎలా జరుగుతున్నది? మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఒక మహిళా రైతు వద్ద నుంచి ఆమె తెచ్చుకున్న టిఫిన్ …
Read More »భూగర్భ డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే Kp కు వినతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైసర్ నగర్ రైసింగ్ స్టార్ హైస్కూల్ వద్ద భూగర్భ డ్రైనేజీ సమస్యపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని …
Read More »