టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారు. తెలంగాణ భవన్లో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రెస్మీట్ నిర్వహించారు. జీవన్రెడ్డి, బాల్క సుమన్, పద్మాదేవేందర్రెడ్డి, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులు మాట్లాడారు. మోదీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిరి వేసారిపోయారన్నారు. విపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిలైందని.. బీజేపీ ముక్త …
Read More »గోల్మాల్ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే: కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని తీసుకొస్తారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు వచ్చి తనను కలిశారని.. జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారని చెప్పారు. పెద్దపల్లిలో జిల్లా కలెకర్ట్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లోకి పోదామా? అని ప్రజల్ని ఆయన …
Read More »ప్రగతి భవన్ నుంచి మునుగోడు వరకు.. కేసీఆర్ భారీ ర్యాలీ
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాతో మునుగోడులో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పార్టీలు గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ మునుగోడులో గెలిచేందుకు అన్ని ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. దీనిలో భాగంగానే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మునుగోడులో ‘ప్రజాదీవెన’ బహిరంగ సభలో పాల్గొననున్నారు. హైదరాబాద్ నుంచి మునుగోడు వరకు భారీ ర్యాలీతో సీఎం వెళ్లేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ప్రగతిభవన్ నుంచి ప్రారంభమైన …
Read More »బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లే: కేసీఆర్
సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు. సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని …
Read More »బండి సంజయ్ పాదయాత్రలో గొడవ.. పలువురికి గాయాలు
జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ బండి సంజయ్ను మండలంలోకి ఆహ్వానించారు. అనంతరం బహిరంగ సభలో సంజయ్ మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరకీ సీఎం కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని సంజయ్ అన్నారు. దీంతో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో గొడవ దిగారు. ఈ …
Read More »కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు
సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 నుంచి రాష్ర్టంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ర్ట మంత్రిమండలి. వీటితో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్వాడీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్. 58,59 జీవోల కింద పేదలకు …
Read More »తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గుడ్ న్యూస్
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కానుక ప్రకటించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57 ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. కొత్తగా మరో 10లక్షల మందికి ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు …
Read More »దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్కాట్ చేస్తున్నా: కేసీఆర్ ఫైర్
సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రగతిభవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్ మండిపడ్డారు. గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం …
Read More »కేసీఆర్ నిప్పు.. ఆయన్ను ఎవరూ టచ్ చేయలేరు: జగదీష్రెడ్డి
కేసీఆర్ సీఎం అయ్యాకే రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని తెలంగాణ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో దేశం తలసరి ఆదాయం తగ్గిపోయిందని విమర్శించారు. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని మండిపడ్డారు. వార్తల్లో ట్రెండింగ్ అయ్యేందుకు ప్రతిపక్ష నేతలు పోటీపడుతున్నారని విమర్శించారు. ప్రజాసమస్యలపై మాట్లాడేందుకు …
Read More »భారీ వర్షాలు.. అలెర్ట్గా ఉండండి: కేసీఆర్ ఆదేశం
మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అలెర్ట్గా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముందని.. నీరుపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్ఎంసీ సిబ్బంది …
Read More »