ఈ నెల 27వ తేదీన జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ, ప్లీనరీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలంతా హాజరయ్యేందుకు ఈ రోజు వరంగల్ లోని సి.ఎస్.ఆర్ గార్డెన్స్ లో సన్నాహాక సమావేశం ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశానికి పూర్వ ఉమ్మడి జిల్లా పార్టీ ఎమ్మెల్యేలు, కార్పోరేషన్ చైర్మన్లు, సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు. మైనింగ్ కార్పోరేషన్ చైర్మన్ గ్యాదరీ …
Read More »తెలంగాణ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం..మంత్రి హరీష్
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కి మద్దతు ఇవ్వాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు.విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చిన కాంగ్రెస్.. తెలంగాణ ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణకు ప్రతిపాదించిన ప్రయోజనాల కోసం ఎందుకు కాంగ్రెస్ పోరాటం చేయడం లేదని నిలదీశారు. రైతుబంధు పథకం అమలుపై సంగారెడ్డిలో ఉమ్మడి మెదక్ జిల్లా …
Read More »కేసీఆర్ను టార్గెట్ చేయబోయి…కామెడీ పాలయిన కాంగ్రెస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఇరకాటంలో పడేయాలనుకున్న ప్రతిసారి..ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతోందనే చర్చ వినిపిస్తోంది. కేసీఆర్ను ఎదుర్కునేందుకు అంటూ చేస్తున్న పని సొంతంగా వారినే బుక్ చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 25వ తేదీన నాగం జనార్ధన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే నాగం రాకకు ముందే…ఆ జిల్లాలో అగ్గి రాజుకుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో …
Read More »డిసెంబర్ నాటికి మిషన్ భగీరథ వంద శాతం పూర్తి..సీఎం కేసీఆర్
వచ్చే ఎన్నికల నాటికి ప్రతీ ఇంటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని తమకు తాముగా స్వీకరించిన సవాల్ కు కట్టుబడి మిషన్ భగీరథ పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. మెయిన్ గ్రిడ్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మొత్తం ప్రాజెక్టు 75 శాతం పూర్తయిందని, గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చేపట్టి నల్లాలు బిగించే పనులు పురోగతిలో ఉన్నాయని …
Read More »పట్టాదారులందరికీ పాస్ బుక్స్, రైతుబంధు చెక్కులు..సీఎం కేసీఆర్
పట్టాదారు పాస్పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కలెక్టర్లతో సమావేశమై చర్చించారు.ఈ సమావేశంలో పాస్ బుక్స్ పంపిణీ, చెక్కుల పంపిణీ నిర్వహణపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా కొత్త పట్టాదారు పాస్ బుక్స్ను సీఎం కేసీఆర్ విడుదల చేశారు.పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. అసైన్డ్ భూముల లబ్దిదారులు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాదారులు, ఏజెన్సీలో …
Read More »సీఎం కేసీఆర్ను కలిసిన కామన్వెల్త్ విజేతలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ కామన్వెల్త్ గేమ్స్ 2018 విజేతలు కలిశారు. ఈ సందర్భంగా కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని సీఎం కేసీఆర్ అభినందించారు. క్రీడాకారులతో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ను కూడా కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. కామన్వెల్త్లో తెలంగాణకు చెందిన వారు మెడల్స్ సాధించడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ర్టానికి, దేశానికి మంచి గౌరవం తీసుకువచ్చారన్నారు. భవిష్యత్లో మరెన్నో విజయాలు సాధించాలని …
Read More »నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం..!
పట్టాదార్ పాస్పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై చర్చించడానికి ఇవాళ ( శనివారం ఏప్రిల్-21) కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు . ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించారు. పాస్ పుస్తకాలు, చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్దేశించిన సమయంలో రైతులందరికీ అందేలా సీఎం కేసీఆర్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరినీ సమన్వయం చేసుకుని …
Read More »ఫలించిన సీఎం కేసీఆర్ కృషి..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఫలించింది. సుదీర్ఘంగా కొనసాగించిన తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాల వల్ల తెలంగాణ ఎయిమ్స్కి మార్గం సుగమం అయింది. ఎయిమ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవైపు సీఎం కెసిఆర్, ఢిల్లీలో ఎంపీలు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు చేసిన పలు ప్రయత్నాలు సఫలం అవడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »60,000 మంది జీవితాలను మార్చే మరో అద్భుత నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్
సబ్బండ వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, సంక్షేమమే ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దాదాపు 60,000 మంది జీవితాలను మార్చే నిర్ణయం తీసుకున్నారు. బోదకాల వ్యాధితో భాదపడుతూ జీవనభృతి కోల్పోయిన వారికీ నెల నెల జీవనభృతి అందిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం బోధకాల వ్యాధిగ్రస్తులకు జీవనభృతి అందించడానికి తగు చర్యలు చేపట్టడం …
Read More »సీఎం కేసీఆర్ పథకానికి ఇంకో రాష్ట్రం ఫిదా..!!
సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా ముందుకు సాగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా మరో రాష్ట్రం మన సర్కారు పథకానికి ఫిదా అయింది. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం అమోఘమని కేరళ రాష్ట్ర మంత్రి మెర్సికుట్టి ప్రశంసించారు. మంగళవారం సచివాలయంలో ఆమె రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ …
Read More »