యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు పూర్తయి భక్తుల రాక మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి కొండపైకి ఇకపై ప్రైవేట్ వెహికిల్స్ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ముఖ్యకార్యనిర్వాహణాధికారి (ఈవో) గీత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి కొండపై ఇకపై భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ఈవో తెలిపారు. దీంతోపాటు స్వామివారిని నిత్యం జరిపే సేవల …
Read More »రామ్గోపాల్ వర్మ సంచలన ప్రకటన
ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ను తీస్తానని చెప్పారు. త్వరలోనే దాన్ని తీస్తానని ప్రకటించారు. తన డైరెక్షన్లో రూపొందిన బాలీవుడ్ ‘డేంజరస్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ కేసీఆర్ జీవితంపై బయోపిక్ తీస్తానని చెప్పారు. తనకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా బాగానచ్చిందని రామ్గోపాల్ వర్మ అన్నారు. తాను తీసే సినిమాలను థియేటర్, ఓటీటీ …
Read More »ఆ విద్యార్థుల భవిష్యత్ కాపాడండి: మోడీకి కేసీఆర్ లేఖ
రష్యా-ఉక్రెయిన్ మ ధ్య యుద్ధం జరుగుతున్న కారణంగా భారత్కు తిరిగివచ్చిన వైద్య విద్యార్థులు స్వదేశంలోనే చదువుకునేందుకు అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ విషయంపై హ్యూమన్ యాంగిల్లో ఆలోచించి ప్రత్యేక కేసుగా ట్రీట్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. సుమారు 20వేలకు పైగా ఇండియన్ స్టూడెంట్స్ ఉక్రెయిన్ నుంచి వచ్చేశారని.. వీరంతా దేశంలోని వివిధ మెడికల్ …
Read More »తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..
టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. టెట్ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్ 12న టెట్ ఎగ్జామ్ను నిర్వహించనున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన …
Read More »దేశమంతా ఒకే విధానం ఉండాలి: మోడీకి కేసీఆర్ లేఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ అంశంపై పలు విషయాలను సీఎం ప్రస్తావించారు. తెలంగాణలో యాసంగి సీజన్లో పండిన మొత్తం ధాన్యాన్ని సేకరించాలని.. అలా చేయకపోతే కనీస మద్దతు ధరకు అర్థం ఉండదని సీఎం పేర్కొన్నారు. దీంతో జాతీయ ఆహార భద్రత లక్ష్యానికి విఘాతం కలుగుతుందని చెప్పారు. ధాన్యం పూర్తిగా సేకరించకపోతే రాష్ట్ర రైతులు, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం ఉంటుందని …
Read More »ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఫుల్ క్లారిటీ!
హైదరాబాద్: ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో సీట్లు తగ్గడం దేనికి సంకేతమో బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నారు. యూపీలో బీజేపీ బలం తగ్గుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఆ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందన్నారు. టీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశం బాగుపడాలంటే బీజేపీని గద్దె దించాలని ఆయన పునరుద్ఘాటించాఉ. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలన బాగాలేదనే …
Read More »తెలంగాణ SSC,Inter పరీక్షల షెడ్యూల్ తేదిల్లో మార్పులు
తెలంగాణ వ్యాప్తంగా మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సవరించిన పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఫస్టియర్ పరీక్షలు 6 నుంచి మే 23వ తేదీ వరకు, సెకండియర్ పరీక్షలు 7 నుంచి 24 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మార్చి …
Read More »అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ పై ఎంఐఎం ఎమెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. శాసనసభలో మంగళవారం జరిగిన సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనంతరం అక్బరుద్దీన్ ఓవైసీ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓవైసీ మాట్లాడుతూ.. ప్రజలకు కేసీఆర్ మరింత సేవ చేయాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే సీఎం కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉందన్నారు. పోలీస్, మెడికల్, ఎడ్యుకేషన్ …
Read More »ఆ విద్యార్థుల మెడిసిన్ కోర్సు ఖర్చు మేమే భరిస్తాం: కేసీఆర్
హైదరాబాద్: ఉక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న తెలంగాణ విద్యార్థుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చేసిన విద్యార్థులు మళ్లీ ఉక్రెయిన్ వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదు. మెడిసిన్ విద్య మధ్యలో ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆ విద్యార్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. మెడిసిన్ పూర్తి చేసేందుకు ఆ …
Read More »ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్ న్యూస్
హైదరాబాద్: ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, సెర్ప్ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును సీఎం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇకపై సమ్మె చేయడంలాంటి పొరపాట్లు చేయొద్దని సూచించారు. మరోవైపు సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. బలమైన కేంద్రం, బలహీన రాష్ట్రాలు …
Read More »