ప్రభుత్వ శాఖల్లో అవినీతిని నిరోధించేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏసీబీ రూపొందించిన ఈ యాప్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ‘ఏసీబీ 14400’గా దీనికి నామకరణం చేశారు. ప్రభుత్వశాఖల్లో ఎవరైనా లంచం అడిగితే ఈ యాప్ ద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని సీఎం జగన్ చెప్పారు. ఫిర్యాదుతో పాటు తమ దగ్గర ఉన్న వీడియో, ఆడియో డాక్యుమెంట్లను ఏసీబీకి పంపొచ్చన్నారు. కంప్లైంట్ చేయగానే ఫిర్యాదుదారు మొబైల్కు రిఫరెన్స్ …
Read More »దావోస్ నుంచి రాష్ట్రానికి చేరుకున్న జగన్.. నేతల ఘనస్వాగతం
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో సీఎంకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రి జోగి రమేశ్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వల్లభనేని వంశీ, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు సీఎంకు స్వాగతం పలికారు.
Read More »రాబోయే రోజుల్లో మరింతగా సేవ చేస్తా: సీఎం జగన్
సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసి, వైకాపా ప్రభుత్వం ఏర్పడి నేటితో మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జగన్ సోషల్ మీడియా వేదికగా ప్రజలకు కృజ్ఞతలు తెలిపారు. ‘‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు …
Read More »అదీ జగన్ ఫేస్ వేల్యూ..: ఏపీ మంత్రి ఆర్కే రోజా
టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్ప ఏమైనా చర్చించారా అని ఏపీ మంత్రి రోజా ప్రశ్నించారు. చేసిన తప్పులను సరిదిద్దుకోకుండా సీఎం జగన్ను విమర్శించడమే ప్రతిపక్ష నేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ నేతలు పగటి కలలు కంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి, టీడీపీకి చంద్రబాబు శని అని.. ఈ మాటలను స్వర్గీయ ఎన్టీఆరే స్వయంగా …
Read More »వైసీపీ మంత్రుల బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం
వైసీపీ మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. గురువారం ఉదయం శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంది. దారి పొడవునా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగుడుగనా నీరాజనాలు పలుకుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని మంత్రులు ఈ యాత్రలో వివరిస్తున్నారు. విజయనగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. …
Read More »నన్ను ఓడించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ..: వల్లభనేని వంశీ
తనతో ఎవరు కలిసొచ్చినా రాకపోయినా తన పని తాను చేసుకుంటూ వెళ్తానని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. వైసీపీలో తనకెలాంటి సమ్యలూ లేవని.. ఎవరికైనా ఇష్యూ ఉంటే వారే చూసుకోవాలని హితవు పలికారు. వైసీపీ నేత దుట్టా రామచంద్రరావుతో విభేదాల నేపథ్యంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని చెప్పారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని.. గత రెండు ఎన్నికల్లో …
Read More »ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. ఈ ఏడాది ముందుగానే వ్యవసాయ సీజన్ను ప్రారంభించి గోదావరి, కృష్ణా వాటర్ను ముందే విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల నవంబర్లో తుపాను వచ్చే నాటికి పంట చేతికి వస్తుందని మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేసి ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. గోదావరి డెల్టాకు …
Read More »పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్.. ఏపీ వ్యాప్తంగా బోర్లకు మీటర్లు: జగన్
ఏపీలో వ్యవసాయ మోటార్లు అన్నింటికీ విద్యుత్మీటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్టు సక్సెస్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీన్ని కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాలు ఎఫ్ఏవో ఛాంపియన్ అవార్డుకు ఎంపికైన …
Read More »వాళ్లే టెన్త్ పేపర్లు లీక్ చేశారు: సీఎం జగన్
వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకే టెన్త్ పరీక్షల పేపర్లను లీక్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. టీడీపీకి మాజీ మంత్రి నారాయణకు చెందిన శ్రీ చైతన్య, నారాయణ స్కూల్స్ నుంచే పేపర్లు లీక్ అయ్యాయన్నారు. తిరుపతిలో జగనన్న విద్యాదీవెన నిధులను సీఎం విడుదల చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదని.. ఇప్పుడు తాము ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని ఆక్షేపించారు. అందుకే వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని …
Read More »గృహ వినియోగదారులకు పవర్ కట్ ఇబ్బందులొద్దు: సీఎం జగన్
రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో అదనంగా కెపాసిటీని జోడించాలని.. తద్వారా విద్యుత్ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ బి.శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని …
Read More »