దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,150 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 83 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనే 75 మంది కొవిడ్తో చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 11,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.76 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా …
Read More »చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం
కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతిపెద్ద నగరం షాంఘైలో 17,077 కేసులు బయటపడ్డాయి. తాజా ఉద్ధృతిలో ఈ ఒక్క నగరంలోనే 90 వేలకు చేరింది. చైనాలో ఇటీవల ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ ఉద్ధృతితో మహమ్మారి విజృంభిస్తోంది
Read More »చైనాలో మళ్లీ కరోనా కలకలం
చైనాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు నమోదు అయింది. ఇప్పుడు ఆ సంఖ్య బుధవారానికి దాదాపు 20 వేలకు పైగా చేరింది. ఈ ఒక్కరోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. షాంఘైలోనే అత్యధిక కేసులు నమోదైనట్లు …
Read More »మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వేరియంట్
ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి …
Read More »చైనాలో మళ్లీ కరోనా విజృంభణ
కరోనా పుట్టినిళ్లు చైనాలో మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గురువారం 1742 కేసులు నమోదవగా, అంతకుముందురోజు 1206 కేసులు రికార్డయ్యాయి. 2020లో వుహాన్లో కరోనా కలకలం తర్వాత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
Read More »మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?
ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో దక్షిణ కొరియాలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో …
Read More »ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా సరికొత్త వేరియంట్
కరోనా ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మరికొన్ని వేరియంట్లలోకి రూపాంతరం చెందుతూ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ దేశంలో ఓ సరికొత్త వేరియంట్ కరోనా కేసులు రెండు నమోదయ్యాయి. ఈ వేరియంట్ BA1 (ఒమిక్రాన్), BA2ల కలయిక అని ఇజ్రాయేల్ వైద్య అధికారులు చెబుతున్నారు… అయితే ప్రపంచానికి ఈ వేరియంట్ ఇంకా తెలియలేదు. ఈ వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఈ సందర్భంగా వారు చెప్పారు
Read More »దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో 89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 4,184 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,184 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 6,554 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 4,24,20,120 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,488 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 179.53 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 4,362 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,67,315కు చేరింది. ఇందులో 4,23,98,095 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,102 మంది బాధితులు మరణించగా, 54,118 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 66 మంది మరణించగా, 9620 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »