గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
Read More »ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరులో అత్యధికంగా 740 కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్ ద్వారా తెలిపింది. గుంటూరులో 527, విశాఖపట్నంలో 391, కర్నూలులో 296, కృష్ణాలో 278, శ్రీకాకుళంలో 279, ప్రకాశంలో 174 కేసులు వెలుగులోకి …
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 96,982 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ మంగళవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,26,86,049కు పెరిగింది. మహమ్మారి ప్రభావంతో మరో 446 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 50,143 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 7,88,223కు చేరాయి. ఇప్పటి వరకు 1,17,32,279 …
Read More »పరేశ్ రావల్ కు కరోనా
ప్రముఖ సీనియర్ సినీ నటుడు పరేశ్ రావల్ కు కరోనా సోకింది ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. తాను సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. 65 ఏళ్ల పరేశ్ మార్చి 9న కరోనా టీకా తొలి డోస్ తీసుకున్నారు. కాగా ఈ వారంలో పలువురు ప్రముఖులకు కరోనా వచ్చింది. అమీర్ ఖాన్ మాధవన్, కార్తీక్ ఆర్యన్లు వైరస్ బారిన …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి గతరాత్రి గం.8 వరకు కొత్తగా 495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,804కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,685కి పెరిగింది. నిన్న కరోనా నుంచి 247 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 4241 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 58 029 కరోనా పరీక్షలు నిర్వహించారు…
Read More »షాకింగ్ న్యూస్ -ఏపీలో ఒకే ఇంట్లో 21 మందికి కరోనా
ఏపీలో తూ.గో. జిల్లా తొండంగి మండలంలోని ఒకే ఇంట్లో 3. ఏకంగా 21 మందికి కరోనా సోకింది. రాజమండ్రిలోని తిరుమల కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థి ఇటీవలే ఇంటికి వెళ్లాడు. అతడికి కరోనా సోకగా.. అది క్రమంగా ఇతరులకూ వచ్చింది. దీంతో ఈ కుటుంబాన్ని ఐసోలేషన్లో ఉంచిన వైద్యులు… వారికి చికిత్స అందిస్తున్నారు
Read More »దేశంలో కొత్తగా 59,118 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 59,118 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,26,652కు చేరింది. అటు నిన్న కరోనాతో 257 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,60,949కు పెరిగింది. ఇక దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4లక్షలను దాటింది. ప్రస్తుతం దేశంలో 4,21,066 యాక్టివ్ కేసులున్నాయి
Read More »మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్
మహారాష్ట్రలో కరోనా ఉధృతి మరింత పెరుగుతోంది అక్కడ కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్తగా 35,952 కరోనా కేసులు, 111 మరణాలు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే 5,504 కరోనా కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. చాలా చోట్ల ఆంక్షలు విధించినా కేసులు తగ్గట్లేదు
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 111 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి గడిచిన 24 గంటల్లో మరో 111 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన స్టేట్ హెల్త్ బులెటిన్ లో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 81,901 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. సెకండ్ వేవ్ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read More »తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచించారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 214 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2,92,835కి చేరింది. 1586 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 3,781 యాక్టివ్ కేసులున్నాయి.. చికిత్స నుంచి కోలుకుని 2,86,898 మంది డిశ్చార్జ్ అయ్యారని …
Read More »