ఏపీ రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 58,835 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. 12,994 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 96 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి కోలుకొని 18,373 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,03,762 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో తూర్పు గోదావరిలో అత్యధికంగా 2652 కేసులు రాగా.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 274 కేసులు నమోదయ్యాయి.
Read More »మెగాస్టార్ తొలి అడుగు
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో… మెగాస్టార్ చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నిన్న సోమవారం ప్రారంభమైంది. కర్ణాటక చింతామణి ప్రాంతంలో దాన్ని ఓపెన్ చేశారు. అఖిల భారత చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ దాన్ని ప్రారంభించగా.. మెగాస్టార్ చిరు స్వయంగా అతడికి అభినందనలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అభిమానుల మద్దతు ఎక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల్లోనూ.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ లను నెలకొల్పనున్నారు.
Read More »కరోనా కట్టడీపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణలో కరోనా థర్డ్ వేవు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు. బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ENTలో 250 బెడ్లు ఉన్నట్లు తెలిపారు.
Read More »తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,043 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 21 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,56,320కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,146 మంది మరణించారు. కొత్తగా 4,693 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,13,968కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,206యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసుల్లో GHMCలో 424 నమోదయ్యాయి.
Read More »లాక్డౌన్ సడలింపుల దిశగా అడుగులు
మహారాష్ట్రలో క్రమంగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతుండటంతో లాక్డౌన్ సడలింపుల దిశగా ఆ రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. లాక్డౌన్ను దశలవారీగా సడలిస్తామని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. జూన్ 30 నాటికి అన్లాక్ ప్రక్రియ పూర్తవుతుందని, అయితే ఎప్పటి నుంచి అన్లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. మొత్తం నాలుగు దశల్లో అన్లాక్ అమలు చేయనున్నట్లు చెప్పారు.
Read More »రష్మిక పిలుపు
ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో మనమంతా ధైర్యంగా ఉండాలని హీరోయిన్ రష్మిక ఓ వీడియో ట్వీట్ చేసింది. ‘ రోజు రోజుకు విజృంభిస్తోన్న కరోనా సవాల్ విసురుతోంది. ఈ సమయంలో మనం సానుకూలంగా ఆలోచించాలి. ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం. ప్రజల్లో ధైర్యం నింపడానికి వచ్చే వారం నుంచి మన పరిసరాల్లోని కొవిడ్ హీరోలను పరిచయం చేయాలి అనుకుంటున్నాను. మీ ముఖాల్లో చిరునవ్వు కోసం ఈ చిన్ని ప్రయత్నం’ అని …
Read More »లాక్డౌన్, వ్యాక్సినేషన్పై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
తెలంగాణ రాష్ర్టంలో కరోనా లాక్డౌన్, వ్యాక్సినేషన్తో పాటు ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి హరీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కరోనా వ్యాక్సినేషన్పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదటగా ఫ్రంట్ లైన్ వారియర్లకు …
Read More »కంటతడిపెట్టిన సోను సూద్
కరోనా బాధితుల పాలిట ఆపద్బాంధవుడు సోనూ సూద్ ఓ ఇంటర్వ్యూలో కంటతడిపెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు బ్రతికుండి బెడ్లు, ఆక్సిజన్ కోసం పోరాడుతుంటే తాను తట్టుకోలేకపోయేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు. కాగా సోనూ తండ్రి శక్తి సాగర్ సూద్ పంజాబ్లో వ్యాపారం చేసేవారు. ఆకలితో ఉన్నవారికి సోనూతో కలిసి సాయం చేసేవారు. ఇక సోనూ తల్లి సరోజ్ పేదలకు ఉచితంగా చదువు చెప్పేవారు. అనారోగ్యంతో కొంతకాలం క్రితం వారు కన్నుమూశారు.
Read More »జలుబు త్వరగా తగ్గాలంటే..?
సొంఠి, మిరియాల పొడి, తులసి ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిలో తేనె కలిపి రోజూ 3 సార్లు తాగాలి -స్పూన్ తేనెలో దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు వేడినీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించాలి. అలాగే వెల్లుల్లిని నమిలి మింగడం వల్ల జలుబు తగ్గుతుంది వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే జలుబు …
Read More »RGV ఇంట్లో విషాదం
వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ సోదరుడు పి. సోమశేఖర్ ఆదివారం కరోనాతో కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ‘ముస్కురాకే దేఖ్ జరా’ అనే బాలీవుడ్ మూవీకి దర్శకుడిగా పనిచేసిన ఆయన రంగీలా, దౌడ్, సత్య, జంగిల్, కంపెనీ వంటి సినిమాలకు ప్రొడక్షన్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా తన జీవితంలో కీలకమైన వ్యక్తులలో సోమశేఖర్ ఒకరని RGV పలు సందర్భాలలో చెప్పారు.
Read More »