తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 2,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మరణించారు. 3,464 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 34,084 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 24 గంటల్లో 87,110 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 307 పాజిటివ్ కేసులు, నల్లగొండ జిల్లాలో 183, రంగారెడ్డి జిల్లాలో …
Read More »2డీజీ మందును అసలు ఎవరు..? ఎలా వాడాలి.. ఇవీ డీఆర్డీవో గైడ్లైన్స్
కరోనాపై డీఆర్డీవో సంధించిన అస్త్రం 2డీజీ. పొడి రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఔషధం.. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలు ఉన్న కరోనా పేషెంట్లపై బాగా పని చేస్తున్నట్లు డీఆర్డీవో చెప్పింది. తాజాగా ఈ 2డీజీ మందును ఎలా వాడాలో చెబుతూ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వైద్యుల పర్యవేక్షణలోనే ఈ మందును వాడాలని స్పష్టం చేసింది. ఆ గైడ్లైన్స్లో ఇంకా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న …
Read More »అందరికీ తొలి డోసు వ్యాక్సిన్కు ఎంత కాలం పడుతుందో తెలుసా
ఈ 2021 ఏడాది ముగిసేలోపు దేశంలో 18 ఏళ్లు నిండిన అందరికీ కరోనా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పూర్తి వ్యాక్సినేషన్ కాదు కదా.. కేంద్రం చెప్పిన సమయానికి అందరికీ కనీసం తొలి డోసు వ్యాక్సిన్ ఇవ్వడం కూడా కుదరదని తాజాగా ఓ అధ్యయనం తేల్చింది. దేశంలో 18 ఏళ్లు నిండిన వాళ్లు 94.4 …
Read More »Big Breaking-ఆనందయ్య మందుపై ఏపీ సర్కారు సంచలన నిర్ణయం
ఏపీలో కరోనా మహమ్మారికి విరుగుడుగా నెల్లూరు ఆనందయ్య ఇస్తున్న మందులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కళ్లలో వేసే డ్రాప్స్ తప్ప మిగితా అన్ని మందులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. సీసీఆర్ఏఎస్ నివేదిక ప్రకారం ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్ మందులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంట్లో వేసే మందుపై ఇంకా నివేదికలు రాలేదని, అవి వచ్చాక ఆ మందుపై నిర్ణయం …
Read More »తెలంగాణలో కొత్తగా 1,801 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,801 పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. కరోనా నుంచి 5,32,557 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 35,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 3,263 మంది మృతి చెందారు.
Read More »విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత వల్ల రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన సాధారణ యువతకు వ్యాక్సిన్ వేయట్లేదు. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి టీకాలు ఇస్తే.. కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read More »కరోనాపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కరోనాకు ధన్యవాదాలు తెలిపాడు. ‘చనిపోయిన వ్యక్తులను మనం ఎంత తొందరగా మర్చిపోతామో ప్రస్తుత పరిస్థితులు మరోసారి నిరూపించాయి. అందుకే ఇతరులను ఆకట్టుకోవడంలో మన జీవితాన్ని ఎప్పుడూ వృథా చేసుకోవద్దు. మనం కోరుకున్న విధంగా జీవితంలో బతకాలి’ అని RGV అన్నాడు.
Read More »దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 1,52,734 కేసులు, 3,128 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,80,47,534కు పెరగ్గా, ఇప్పటివరకు 3,29,100 మంది కరోనా ధాటికి చనిపోయారు. మరో 2,38,022 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 2,56,92,342కు చేరింది. ప్రస్తుతం దేశంలో 20,26,092 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు
కరోనా మహమ్మారి నివారణకు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం విదితమే. నేటితో ముగియనున్న లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. నేటి వరకు రోజుకు 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇవ్వగా, ఆ సమయాన్ని మరో మూడు గంటల పాటు పొడిగించారు. ఇక ప్రతీ …
Read More »చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే..లేచి తిరిగోచ్చాడు..
రాజస్థాన్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. చనిపోయాడని ఓ వ్యక్తికి అంత్య క్రియలు నిర్వహిస్తే వారం తర్వాత ఆ వ్యక్తి ఇంటికి వచ్చిన ఘటన తాజాగా బయటపడింది. రాజ్సమంద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ దవాఖాన ఆర్కే హాస్పిటల్లో మరణించిన గోవర్దన్ ప్రజాపతి మ్రుతదేహాన్ని పొరపాటున ఓంకార్ లాల్ గడులియా బంధువులు తీసుకెళ్లారని విచారణలో తేలింది. వారిద్దరూ అదే దవాఖానలో చికిత్స పొందారు. అసలు కథేమిటంటే ఓంకార్ …
Read More »