దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1206 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇండియాలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకున్నది.
Read More »దేశంలో కొత్తగా 46,148 కరోనా కేసులు
ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,148 కరోనా కేసులు నమోదయ్యాయి. 979 మంది చనిపోయారు. మరో 58,578 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,79,331కి చేరింది. కోలుకున్న వారు 2,93,09,607 మంది కాగా.. యాక్టివ్ కేసులు 5,72,994గా ఉన్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 3,96,730 మంది మరణించారు. రికవరీ రేటు 96.8 శాతానికి చేరింది.
Read More »తెలంగాణలో కొత్తగా 1,061 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,061 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1,556 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,18,837కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,524గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3,618 మంది చనిపోయారు.
Read More »కొవిడ్ కంట్రోల్ రూమ్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని వెంగళ్రావు నగర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సెంటర్ ప్రారంభోత్సవం కంటే …
Read More »డెల్టా వేరియంట్ ఎఫెక్ట్-సిడ్నీలో లాక్డౌన్
కరోనా అత్యంత సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. మరి అలాంటి దేశంలో కూడా డెల్టా వేరియంట్ దడపుట్టిస్తున్నది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో డెల్టా వేరియంట్ లక్షణాలున్న కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సెంట్రల్ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో అధికారులు లాక్డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి బాధితుని ఇంటి పక్కనున్న నాలుగు కుటుంబాలను వారం రోజులపాటు బయటకు రావద్దని అధికారులు సూచించారు. అంతర్జాతీయ విమాన …
Read More »పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్ హెచ్చరిక
పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్ హెచ్చరిక కరోనా పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం మంచిది కాదన్న నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బడిలో కేవలం విద్యార్థులే కాక ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కొవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదు పాఠశాలలు తెరిచే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, …
Read More »చిన్నపిల్లలకు మాస్కులు వాడుతున్నారా..?-ఐతే ప్రమాదమే..?
కరోనా కారణంగా గత 15 నెలలుగా ప్రజలు బయటకు రావడం తగ్గించేశారు. ఒకవేళ బయటకు రావాల్సి వచ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక స్కూళ్లు మూతపడటంతో పిల్లలు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోవడానికి కూడా వెళ్లనీయడం లేదు. దీంతో వైరస్, బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఫ్లూ, ఇతర జబ్బుల బారిన పడడటం తగ్గిపోయింది. దీంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల …
Read More »తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో లాక్డౌన్,వర్శపాతం,సాగు,కరోనా పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో ఆదివారం నుండి లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ను ఎత్తివేసి …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రభుత్వ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులతో పాటు వారి మీద ఆధారపడ్డ వారు.. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఇన్పెషేంట్ వార్డుల్లో కొవిడ్ చికిత్స పొందితే వారికి మెడికల్ రీఎంబర్స్మెంట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఎస్ఏఎమ్ రిజ్వీ తెలిపారు. రూ. లక్ష వరకు రీఎంబర్స్మెంట్ ఇవ్వనున్నారు. ప్రయివేటు ఆస్పత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందిన వారికే రీఎంబర్స్మెంట్ వర్తించనుంది.
Read More »రాబడులను పూర్తిగా కోల్పోయాం:-మంత్రి కేటీఆర్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు లేఖ రాశారు. గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజ్ లో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభ కాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాము. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం రెండవ దశను సైతం దాటి కొనసాగుతున్నది. అతి …
Read More »