దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల తగ్గుతూ వచ్చిన కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 46,164 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. కొత్తగా 34,159 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. మరో 607 మంది బాధితులు వైరస్ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,58,530కు చేరింది. ఇప్పటి వరకు 3,17,88,440 …
Read More »భారత్లో దీర్ఘకాలంగా కరోనా
భారత్లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ ఊహకందని హెచ్చరిక జారీ చేశారు. భారత్లో కోవిడ్-19 మహమ్మారి స్థానికత స్థాయికి చేరింది. ఫలితంగా ఇది స్వల్పంగా లేదా మధ్యస్థంగా వ్యాప్తి చెందుతుంటుందన్నారు. ఇటువంటి పరిస్థితిలో జనం ఈ వైరస్తో సహజీవనం చేస్తూ, అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా నుంచి ఉపశమనం లభించాలంటే దీర్ఘకాలం పడుతుందన్నారు. దేశంలోని …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. నిన్న 25వేలకు చేరిన పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. మరో వైపు మరణాలు సైతం 600కుపైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37,593 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 34,169 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి 24 గంటల్లో 648 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.99 …
Read More »కరోనా వైరస్ డెల్టా వేరియంట్ వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోందా..?
కరోనా వైరస్ డెల్టా వేరియంట్ ( Delta Variant ) వ్యాప్తిని చైనా సమర్థవంతంగా అడ్డుకుంటోంది. సోమవారం రోజున ఆ దేశంలో స్థానికంగా ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. జూలై తర్వాత జీరో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. నేషనల్ హెల్త్ కమిషన్ ఈ విషయాన్ని చెప్పింది. జూలై 20వ తేదీ నుంచి చైనాలో డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తోంది. నాన్జింగ్ నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బందిలో …
Read More »తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్కు అవకాశం లేదా..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్కు అవకాశం లేదని.. అయినప్పటికీ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం 27 వేల పడకలు ఉన్నాయని, మరో ఏడు వేల పడకలు నెలాఖరుకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో చేపట్టిన 100 శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇందులో భాగమేనని పేర్కొన్నారు. ఖైరతాబాద్ సర్కిల్లోని ఓల్డ్ సీబీఐ క్వార్టర్స్లో సోమవారం టీకా పంపిణీ …
Read More »దేశంలో కొత్తగా 25,467 కరోనా కేసులు
భారత్లో కొత్తగా 25,467 కరోనా పాజిటివ్ ( Corona Positive )కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 354 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. సుమారు 39,486 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 3,19,551గా ఉంది. ఇక ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 4,35,110గా ఉంది. వ్యాక్సినేషన్ రిపోర్ట్ను …
Read More »వాట్సాప్ లో ఇక నుండి వ్యాక్సినేషన్ బుకింగ్
వ్యాక్సినేషన్ బుకింగ్ ( Vaccine Booking )పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పౌరుల సౌలభ్యం కోసం మొబైల్ ఫోన్లలో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్టాట్లు బుక్ చేసుకునే వీలు కల్పించింది. దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఓ ట్వీట్ చేశారు. ఈ విధానం వల్ల టీకా రిజిస్ట్రేషన్ మరింత సులువుగా మారనున్నది. వాట్సాప్ ద్వారా టీకా బుక్ చేసుకునే పద్ధతి …
Read More »దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 34,457 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ఇందులో 3,61,340 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల కనిష్ఠానికి చేరిందని తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 375 మంది మరణించారని వెల్లడించింది. కాగా, శుక్రవారం 36,571 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా వాటి సంఖ్య 34 వేలకు తగ్గింది. దీంతో …
Read More »అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ వల్ల ఇప్పటికే అమెరికాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయని, గత నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు 286శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మరణాల్లో కూడా రికార్డు స్థాయి పెరుగుదల కనిపించింది. గడిచిన నెలరోజుల్లో కరోనా మరణాల్లో 146శాతం పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పుడు తాజాగా …
Read More »దేశంలో కొత్తగా 36,401 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజాగా 39,157 మంది బాధితులు కోలుకున్నారు. 24 గంటల్లో 530 మంది బాధితులు మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,800 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3,64,129 ఉన్నాయని చెప్పింది. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,33,049 …
Read More »