బాలీవుడ్ నటి నోరా ఫతేహికి కోవిడ్ సోకింది. తాను కోవిడ్ తో తీవ్రంగా బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ఆమె పేర్కొంది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నానని తెలిపిన నోరా.. అందరూ జాగ్రత్తగా ఉండాలి.. మాస్కులు ధరించాలని కోరింది. వైరస్ వేగంగా వ్యాపిస్తోందన్న ఫతేహి.. ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని తెలిపింది. కాగా ప్రభాస్ ‘బాహుబలి’లో స్పెషల్ సాంగ్లో ఈమె నటించింది.
Read More »అమెరికాలో ఒక్కరోజే 6లక్షల కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 24 గంటల్లో ఒక్క అమెరికాలోనే 6 లక్షల కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో ఇదే ప్రపంచ రికార్డు అని, ఇప్పటివరకు ఒక్క రోజులో ఇన్ని కేసులు ఎప్పుడూ రాలేదని అక్కడి అధికారులు తెలిపారు. కరోనా కాటుకు 1300 మంది మరణించారు. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఫ్రాన్స్లో 2.06 లక్షలు, UKలో 1.90 లక్షల …
Read More »ముంబైలో కరోనా అలజడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 3,671 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ముంబైలో 2,510 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇవాళ 1100 కేసులు పెరిగాయి. ఇక థారావిలో మే 18 తర్వాత అత్యధికంగా ఇవాళ 20 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండగా.. కరోనా కట్టడికి ఆంక్షలు విధించడంపై సీఎం ఉద్దవ్ థాక్రే అధికారులతో …
Read More »తెలంగాణలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 67కు పెరిగింది. వీరిలో 22మంది కొత్త వేరియంట్ నుంచి కోలుకున్నారు. కాగా గత 24 గంటల్లో కొత్తగా 280 కరోనా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఒకరు చనిపోయారు. నిన్న మరో 206 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,563 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య …
Read More »అమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అమెరికాలో రోజువారీ కరోనా కొత్త కేసులు ఇప్పుడు 2లక్షల మార్కుకు చేరువయ్యాయి. అతి త్వరలోనే ఆ సంఖ్య తొలిసారి 5లక్షల మార్కును తాకే అవకాశం ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన డేటా ప్రకారం ప్రతిరోజూ సగటున 1,98,404 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Read More »ఇంగ్లండ్ క్యాంప్ లో కరోనా కలవరం
ఇంగ్లండ్ క్యాంప్ లో మొత్తం 6 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే.. జట్టు సపోర్టింగ్ స్టాఫ్, ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే పాజిటివ్ వచ్చిందట. ప్రస్తుతానికి ఆటగాళ్లకెవరికీ వైరస్ సోకలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఓటమి ముంగిట ఇంగ్లండ్ జట్టు కొట్టుమిట్టాడుతోంది. మరి ఈ సిరీస్ కొనసాగుతుందా..? లేక రద్దవుతుందా..? వేచి చూడాలి.
Read More »తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తాజాగా 12
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 12 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 55కి చేరింది. తాజా కేసుల్లో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ (మ) గూడెం గ్రామానికి ఇటీవల వచ్చిన ఓ యువకుడికి ఒమిక్రాన్ వచ్చింది .. తాజాగా అతడి తల్లి, భార్యకు కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే ఎల్లారెడ్డిపేట(మ) నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ …
Read More »ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం
ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం రేపింది. ఇంగ్లండ్ బృందంలో 4 కరోనా కేసులు వచ్చాయి. సిబ్బంది కాగా.. మరో వీరిలో సహాయక ఇద్దరు ఆటగాళ్ల కుటుంబ సభ్యులని తెలిసింది. ఇక, ఆటగాళ్లలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదని తేలిన తర్వాతే.. హోటల్ నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కు అనుమతించారు. ఈ నేపథ్యంలో 3వ టెస్టు రెండో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
Read More »అక్కడ ఒక్కరోజే లక్ష కరోనా కేసులు
ఫ్రాన్స్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఒకేరోజు ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మంది వైరస్ బారిన పడినట్లు ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్యశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం …
Read More »AP లో 82కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా కొవిడ్తో ఒకరు మరణించారు. 164 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,492 మరణాల సంఖ్య- 14,490 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,60,836 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,166
Read More »