మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో చికిత్స పొందుతూ 49 మరణాలు సంభవించినట్లు హెల్త్ బులిటెన్లో అధికారులు తెలిపారు. కరోనా నుంచి 6,206మంది కోలుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారికంగా 80,135 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి హోరు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతున్నది. 24 గంటల్లో 7,430 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్లో పేర్కొంది. దీంతో తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. కొత్తగా 5567 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 3,67,727 మంది కోలుకున్నారు. నిన్న ఒకే రోజు 56 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య …
Read More »కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచనలు
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు సమీక్ష జరిపి స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్ సోమేశ్ కుమార్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెమ్డెసివిర్, ఆక్సిజన్, వ్యాక్సిన్, బెడ్ల లభ్యతలో ఎలాంటి లోపం రానివ్వొద్దని సీఎస్ను సీఎం ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ సమన్వయంతో పని చేసి రాష్ర్టాన్ని కరోనా బారి నుంచి బయటపడేయాలని కేసీఆర్ సూచించారు. అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం …
Read More »తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగింపు
తెలంగాణలో థియేటర్లపై ఆంక్షలు పొడగించారు. మే 8వరకు ఆంక్షలు పొడిగిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి కర్ఫ్యూ మే 8 వరకు పొడిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో కొవిడ్ విస్తరించేందుకు ఛాన్సులు ఎక్కువుండటంలో గతంలోనే థియేటర్ల యజమానులు, పంపిణీదారులు సినిమాలు నిలిపేశారు. వకీల్ సాబ్ మూవీకి మాత్రం మినహాయింపు ఇచ్చారు.
Read More »తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్
తెలంగాణలో గత 24 గంటల్లో 77,091 కరోనా టెస్టులు చేస్తే 7,646 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 4,35,606కు చేరింది. నిన్న కరోనాతో 53 మంది చనిపోగా, మరణాల సంఖ్య 2,261గా ఉంది. గత 24 గంటల్లో 5,926 మంది కరోనాను జయించారు. 77,727 యాక్టివ్ కేసులున్నాయి. మరణాల రేటు 0.51% కాగా రికవరీల రేటు 81.63%గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,29,05,854 కరోనా టెస్టులు చేశారు.
Read More »దేశంలో కరోనా ఉద్ధృతి హోరు
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,86,452 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,498 మంది మృతి చెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,87,62,976కు చేరగా మరణాల సంఖ్య 2,08,330గా ఉంది. మరోవైపు కరోనాను జయించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గత 24 గంటల్లో 2,97,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 31,70,228గా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 19,20,107 కరోనా టెస్టులు చేశారు.
Read More »కరోనాతో టాలీవుడ్ యువ దర్శకుడు మృతి
కరోనా వైరస్ విజృంభణ సెకండ్ వేవ్లో మరింత పెరిగింది. శుక్రవారం కరోనా కారణంగా టాలీవుడ్లో ఓ విషాదం చోటు చేసుకుంది. శ్రీవిష్ణుతో ‘మా అబ్బాయి’ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కుమార్ వట్టి కరోనా వైరస్ వల్ల కన్నుమూశారు. కొన్నిరోజుల ముందు ఆయన కొవిడ్ ప్రభావంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం తుది శ్వాస విడిచారు. కుమార్ మరణంతో టాలీవుడ్ షాక్కు గురైంది. కుమార్ వట్టి స్వస్థలం …
Read More »ఆక్సిజన్ లెవల్స్ పెరగాలంటే..?
కరోనా విజృంభిస్తున్న వేళ.. అందరి జాగ్రత్తలూ దీనిపైనే. అందరి మాటలూ వీటిని పెంచుకోవడం ఎలా అనేదానిపైనే. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ)లోని ప్రధాన ప్రొటీన్ హిమోగ్లోబిన్. ఇది ఊపిరితిత్తులనుంచి ఆక్సిజన్ (ఓ2)ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడినుంచి కార్బన్డైయాక్సైడ్ (సీఓ2)ను వెనక్కు తీసుకొని …
Read More »దేశంలో కరోనా విళయతాండవం
ప్రస్తుతం దేశంలో కరోనా విళయతాండవం చేస్తున్నది. వైరస్ విజృంభణతో ప్రతిరోజు పాజటివ్ కేసులు భారీసంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో గత 24 గంటల్లో కరోనా కేసులు 4 లక్షలు దాటాయి. ఒక్కరోజులో 4 లక్షలకుపైగా కేసులు నమోదవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అదేవిధంగా వరుసగా నాలుగోరోజూ మూడు వేలకు పైగా మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 4,08,323 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల …
Read More »