కరోనాతో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోదీ కోరారు. మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని చెప్పారు. కొవిడ్ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొవిడ్తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read More »థర్డ్ వేవ్ భయాంకరంగా ఉండబోతుందా..?
కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా అదుపులోకి రాకముందే.. థర్డ్వేవ్ భయాలు వణికిస్తున్నాయి. కర్ణాటకలో ఆల్రెడీ మూడో వేవ్ వచ్చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతకొన్ని రోజులుగా అక్కడ చిన్నారులు అధికంగా కరోనా బారిన పడుతున్నారు. మార్చి-మే నెలలను పోలిస్తే.. చిన్నారుల్లో 145% అధికంగా.. టీనేజ్ పిల్లల్లో 160% 3 3 అధికంగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2నెలల్లో ఇప్పటికే 15,000పైగా చిన్నారులు కోవిడ్ బారిన పడ్డారు.
Read More »ఏపీలో కొత్తగా 20,937 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 20,937 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 15,42,079కు పెరిగింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 9,904కు చేరింది. కొత్తగా 20,811 మంది కోలుకోగా, మొత్తం రికవరీ సంఖ్య 13,23,019కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,09,156 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »కరోనాతో ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొన్నది. ప్రముఖ సినీ నిర్మాత, పీఆర్ఓ బీఏ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సినిమా జర్నలిస్టుగా కేరీర్ను ప్రారంభించారు బీఏ రాజు. మహేశ్బాబు, నాగార్జునతో పాటు పలువురు అగ్ర హీరోలు, యువ హీరోలకు, దాదాపు 1500 సినిమాలకుపైగా సినిమాలకు …
Read More »నెటిజన్లకు నయనతార సలహాలు
స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్ శివన్ తాజాగా కొవిడ్ వ్యాక్సిన్కు సంబంధించి ఆన్లైన్లో ట్రోలింగ్కు గురయ్యారు. దానిపై నయనతార నెటిజన్లకు వివరణ ఇచ్చారు. మంగళవారం చెన్నైలో నయనతార, విఘ్నేశ్ శివన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. నర్సు నయనతారకు కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. అయితే నర్సు చేతిలో ఉన్న సిరంజి కనిపించకుండా ఆ ఫొటోలను ఎడిట్ చేసి …
Read More »హీరో మనోజ్ సంచలన నిర్ణయం
లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్న పాతికవేల కుటుంబాలకు సాయం అందించాలని మంచు మనోజ్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నా పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఈ సహాయ కార్యక్రమాలు ప్రారంభించాం. నేను, నా అభిమానులు, మిత్రులు కలసి భవిష్యత్తులోనూ కొనసాగిస్తాం. కరోనా ఉధృతి ఉంది. కనుక దయచేసి అందరూ ఇళ్లల్లో ఉండి… మనల్ని, మన కుటుంబాలను కాపాడుకుందాం. తమ జీవితాల్ని, కుటుంబ సభ్యుల …
Read More »మెగాస్టార్ సంచలన నిర్ణయం
అప్పట్లో రక్తం దొరక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998 చిరంజీవి బ్లడ్బ్యాంక్ను ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇప్పుడాయన మరో సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశవాప్తంగా కరోనా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కొంత కారణం ఆక్సిజన్ కొరత. దాని వల్ల ఎవరూ మరణించకూడదనే ఆలోచనతో ఆయన ఆక్సిజన్ …
Read More »కరోనా సెకెండ్ వేవ్ అంతం ఎప్పుడో తెలుసా..?
కరోనా సెకెండ్ వేవ్ పై కేంద్రం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అలాగే 6-8 నెలల తర్వాతే థర్డ్ వేవ్ ఉండొచ్చని.. అయితే రెండో వేవ్ అంత తీవ్ర ప్రభావం చూపించదని అంచనా వేసింది. ‘సూత్ర’ (ససెప్టబుల్, అన్లిడిటెక్టెడ్, టెస్టెడ్ అండ్ రిమూవ్డ్ అప్రోచ్) అనే మోడల్ ద్వారా శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాలకు వచ్చింది.
Read More »ఇక ఇంటి దగ్గరే కరోనా పరీక్షలు
పుణెలోని మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ లిమిటెడ్ రూపొందించిన హోమ్ ఐసోలేషన్ టెస్టింగ్ కిట్ వినియోగానికి ICMR అనుమతిచ్చింది. దీంతో ఎవరైనా సొంతంగా ఇంట్లోనే కరోనా టెస్ట్ చేసుకోవచ్చు. కోవి సెల్ఫ్ అనే పేరు గల ఈ కిట్ వినియోగానికి ప్లే స్టోర్ / యాప్ స్టోర్ నుంచి ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెస్టులో పాజిటివ్ వచ్చిన వారు హోం ఐసోలేషన్లో ఉంటూ ICMR, ఆరోగ్య శాఖ …
Read More »బ్లాక్ ఫంగస్ ను గుర్తించడం ఎలా…?
నాసికా మార్గం ద్వారా బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. ముక్కుకు ఎండోస్కోపీ చేయడం సహా CT స్కాన్ ద్వారా ఇన్ఫెక్షన్ గుర్తిస్తారు. ఇక మెదడుకు, కంటికి ఈ వ్యాధి సోకిందో లేదో MRI స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నియంత్రణలో లేని డయాబెటిస్.. స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్ థెరపీలో, వెంటిలేటర్పై బాధితుడిని ఉంచడం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది.
Read More »