దేశంలో గడిచిన 24 గంటల్లో 7,974 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. 343 మంది వైరస్లో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,76,478కి చేరింది. మరోవైపు తాజాగా 7,948 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ప్రస్తుతం దేశంలో 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 135.25 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం
పాకిస్తాన్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టులో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ప్లేయర్లకు కరోనా సోకగా తాజాగా మరో ఐదుగురికి పాజిటివ్ వచ్చింది. ప్లేయర్లు హోప్, హుసేన్, గ్రీప్తో పాటు అసిస్టెంట్ కోచ్, టీమ్ ఫిజీషియన్కు వైరస్ సోకిందని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతకుముందు కాట్రెల్, మేయర్స్, ఛేజ్కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ టీంలో కరోనా సోకిన వారి సంఖ్య 8కి చేరింది.
Read More »దేశంలో ఒమిక్రాన్ కలవరం
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో 4 ఒమిక్రాన్ కేసులు వచ్చినట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10కి చేరింది. కాగా ఒమిక్రాన్ వేరియంట్ సాధారణ కరోనా వైరస్ కంటే 70% వేగంగా వ్యాప్తి చెందుతుందని హాంగ్కాంగ్ చేసిన ఓ అధ్యయనం తెలిపింది.
Read More »విదేశాల నుండి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్
తెలంగాణలోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. ఇద్దరు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారించబడినట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్గా నిర్ధారించబడ్డారు అని తెలిపారు. కెన్యా జాతీయురాలి వయసు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశస్థుడి వయసు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్దరి శాంపిల్స్ సేకరించి …
Read More »దేశంలో ఒమిక్రాన్ కలవరం
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఒక్క మహారాష్ట్రలోనే 8 కేసులు వచ్చాయి. ఈ ఉదయం ఢిల్లీలో 4, రాజస్థాన్లో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఒక్కరోజే దేశంలో 16 ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కు పెరిగింది. ఇప్పటివరకు 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
Read More »దేశంలో కొత్తగా 5,784 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా కరోనా కేసులు 5,784 నమోదయ్యాయి. మరోవైపు 252 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు 4,75,888కి చేరాయి. ఇక తాజాగా కొవిడ్ నుంచి 7,995 మంది కోలుకున్నారు. మొత్తంగా 3,41,38,763 మంది రికవరీ అయ్యారు. కాగా ప్రస్తుతం దేశంలో 88,993 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 133.8 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »హీరో అర్జున్ కు కరోనా
కరోనా మహమ్మారి మళ్లీ గుబులు పుట్టిస్తుంది. సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్గా బాలీవుడ్ బేబో, స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారు క్వారంటైన్లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం లోకనాయకుడు కమల్ హాసన్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ …
Read More »త్వరలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం
త్వరలో మళ్లీ కరోనా ఆంక్షలు విధించకోపోతే యూకేలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు శనివారం హెచ్చరించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్లో ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, ఇన్ఫెక్షన్ల రేటు చాలా ఎక్కవగా ఉండటంతో ఆస్పత్రులలో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులలో ఒకరైన డాక్టర్ నిక్ డేవీస్ అన్నారు. యూకేలో శనివారం తాజాగా 633 …
Read More »ఒమైక్రాన్ వేరియంట్ ప్రమాదమా.. కాదా..?
ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియంట్ కరోనా వైర్సను తలచుకొని వణికిపోతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు గత రెండు వేవ్ల కరోనా వైరస్ సంక్షోభాన్ని గుర్తు చేసుకొని ముందు జాగ్రత్తగా సరిహద్దులు మూసేందుకు కూడా సిద్ధమయ్యాయి. అయితే, ఒమైక్రాన్ వేరియంట్ మరీ అంత ప్రమాదకారి కాదని ఇప్పటిదాకా జరిగిన పరిశీలనల్లో వెల్లడవుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మినహా ఏ …
Read More »శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం
కరోనా ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకున్నది. మాస్కు ధరిస్తేనే మల్లన్న దర్శనం కల్పించాలని ఆలయ ఈవో లవన్న నిర్ణయించారు. ఇటీవల కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో.. కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని లవన్న తెలిపారు. భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని మైక్ ద్వారా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో …
Read More »