బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, …
Read More »దేశంలో కరోనా కలవరం .. ఇక మాస్కు తప్పనిసరా..?
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,518 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 9 మంది చనిపోయారు. 2,779 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.
Read More »దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా
దేశంలో కొత్తగా 2828 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం బాధితులు 4,31,53,043కు చేరారు. ఇందులో 4,26,11,370 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,586 మంది మరణించగా, మరో 17,087 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 14 మంది మహమ్మారి వల్ల మృతిచెందగా, 779 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 1,675 కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,675 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,40,068కి చేరింది. తాజాగా 1,635 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 4,26,00,737 మంది బాధితులు కోలుకున్నారు. మరో 31 మంది వైరస్ బారినపడి మృతి చెందగా.. మొత్తం 5,24,490 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు.
Read More »దేశంలో కొత్తగా 2022 మందికి కరోనా
దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 2022 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కరోనాకు గురైన బాధితుల సంఖ్య ఇప్పటివరకు 4,31,38,393కి చేరారు. ఇందులో 4,25,99,102 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,459 మంది కరోనాకు బలయ్యారు. అయితే 14,832 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 2,099 మంది వైరస్ …
Read More »ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సరికొత్త వైరస్
నిన్న మొన్నటివరకు ప్రపంచాన్ని కరోనా వణికించిన సంఘటన మరవకముందే మరో సరికొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11 దేశాల్లో సుమారు 80 కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్రువీకరించింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై విస్తృతంగా స్టడీ చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. కొన్ని దేశాల్లోని జంతు జనాభాలో ఆ వైరస్ను ఎండమిక్గా గుర్తించినట్లు …
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం 1862 కేసులు నమోదవగా, తాజాగా ఆసంఖ్య 2364కు పెరిగింది. ఇది నిన్నటికంటే 29.3 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,29,563కు చేరాయి. ఇందులో 4,25,89,841 మంది కోలుకోగా, 5,24,303 మంది మరణించారు. ఇంకా 15,419 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 10 మంది మృతిచెందగా, 2582 మంది కరోనా నుంచి బయటపడ్డారు.
Read More »ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో కొత్త వైరస్ -అమెరికాలో తొలి కేసు నమోదు
అమెరికాలో మంకీపాక్స్ వైరస్ కేసు నమోదు అయ్యింది. ఆ దేశ అంటువ్యాధుల సంస్థ సీడీసీ ఈ కేసును ద్రువీకరించింది. మాసాచుసెట్స్కు చెందిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ వ్యక్తి ఇటీవల కెనడాలో పర్యటించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతన్ని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో చేర్పించారు. కెనడాలోని క్యూబెక్ ప్రావిన్సులో డజన్ల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. మంకీపాక్స్ను సీరియస్ వైరస్ కేసుగా …
Read More »దేశంలో కొత్తగా 1829 కరోనా కేసులు
దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1829 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,27,199కి చేరాయి. ఇందులో 4,25,87,259 మంది కోలుకున్నారు. మరో 5,24,293 మంది మృతిచెందగా, 15,647 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, 24 గంటల్లో 33 మంది కరోనాకు బలవగా, 2549 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.కరోనా కేసులు తగ్గుతుండటంతో రోజువారి పాజిటివిటీ రేటు కూడా పడిపోతున్నది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.42 …
Read More »దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 1,569 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 28.7శాతం తక్కువని పేర్కొంది. తాజాగా వైరస్తో 19 మంది మృతి చెందగా.. 24 గంటల్లో 917 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,31,25,370కి పెరిగింది. ఇందులో 4,25,84,710 మంది కోలుకున్నారు. మహమ్మారి …
Read More »