కరోనా కట్టడీలో భాగంగా దేశ వ్యాప్తంగా రేపటి నుంచి 15-18 ఏళ్లవారికి వ్యాక్సినేషన్ ఆరంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ రాష్ట్రాలకు పలు జాగ్రత్తలను సూచించారు. ఆ వయసు వారికి కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉందని, అందువల్ల వేర్వేరు టీకాలు కలవకుండా చూసుకోవాలన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అలాగే కోవిడ్ కట్టడికి ఢిల్లీ ఎయిమ్స్ సహకారంతో జనవరి 5-19 మధ్య వెబినార్లను నిర్వహిస్తామన్నారు.
Read More »గ్లెన్ మెక్ గ్రాత్ కి కరోనా
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్ గ్రాత్ కరోనా బారిన పడ్డాడు. ఇంగ్లాండ్ హెడ్ కోచ్ క్రిస్ సిల్వరుడ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్లో భాగంగా 4వ టెస్టు జనవరి 5న ప్రారంభం కానుంది. క్యాన్సర్ బాధితుల కోసం రాబోయే టెస్టులో గ్లెన్ మెక్ గ్రాత్ ఫండ్ రైజింగ్ డ్రైవ్ తలపెట్టాడు. కరోనా సోకడంతో ప్రస్తుతం గ్లెన్ మెక్ …
Read More »ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా
ఛత్తీస్ గడ్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టిఎస్ సింగ్ డియోకి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ధ్రువీకరించారు. గత ఏడాది కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత ఆయనకు వైరస్ సోకడం ఇది రెండోసారి. ప్రస్తుతం వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నానని, తన ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు.
Read More »ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కరోనా కేసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఒక్కరోజే 8 వేల 36 కేసులు వెలుగులోకి వచ్చాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇది 2 వేలు ఎక్కువ. మహారాష్ట్రలో మొత్తం 11,877 కొత్త కేసులు వచ్చాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలోనూ కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. కొత్తగా 3,194 మంది వైరస్ బారినపడ్డారు. 1156 మంది కోలుకున్నారు. దేశరాజధానిలో ప్రస్తుతం 8,397 యాక్టివ్ కేసులున్నాయి. బెంగాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. 6,153 …
Read More »15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు
దేశవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి నేటి నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు ఏర్పాట్లు చేయగా.. కొవిన్ యాప్, పోర్టల్ ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. వ్యాక్సిన్ కేంద్రానికి నేరుగా వెళ్లి టీకా తొలి డోసు తీసుకున్న 4 వారాలకు వీరికి రెండో డోసు ఇస్తారు. కాగా ప్రస్తుతం ఈ వయసు వారికి కొవాగ్జిన్ టీకా ఒక్కటే అందుబాటులో ఉంది.
Read More »15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
15-18 ఏళ్ల వారికి టీకా.. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొవిన్ యాప్ లేదా వెబ్సైటులో ఫోన్ నెంబర్ ఇస్తే.. ఆ తర్వాత వచ్చిన OTPని వెరిఫై చేయాలి. ఒక ఫోన్ నెంబర్ తో నలుగురు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ” ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలు నమోదు చేయాలి ” ఆధార్ నెంబర్ లేదా టెన్త్ ఐడీ నెంబర్ వివరాలు ” ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.. అనంతరం వ్యాక్సినేషన్ స్లాట్ …
Read More »విమానంలో ప్రయాణం – మధ్యలో కరోనా అని తేల్సింది..?
USAకు చెందిన మరిసా ఫొటియో అనే మహిళ షికాగో నుంచి ఐర్లాండ్ వెళ్లే విమానం ఎక్కింది. గొంతు నొప్పిగా ఉండటంతో.. బాత్రూంకు వెళ్లి స్వయంగా ర్యాపిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో అటెండెంట్కు విషయం చెప్పి.. విమానం ల్యాండ్ అయ్యేవరకు 3గంటల పాటు బాత్రూంలో ఐసోలేషన్లో గడిపింది. గత నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా.. తోటి ప్రయాణికులకు కరోనా సోకకుండా ఆమె …
Read More »ఆ వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా వాడోచ్చు..!
హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు (పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఉద్యోగులు) జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు ఇవ్వనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులుండి, 60 ఏళ్లు దాటిన వారూ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు .. ఇందుకోసం రెండు డోసులు పొంది 9 నెలలు పూర్తికావాలి. ఇంతకుముందు ఏ వ్యాక్సిన్ పొందారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా ఇస్తారు. ఇందుకోసం కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Read More »ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు
ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 17కు చేరింది. UAE నుంచి బెంగళూరు ఎయిర్పోర్టులో దిగి ప్రకాశం జిల్లాకు వచ్చిన 52 ఏళ్ల మహిళకు డిసెంబర్ 24న కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె నమూనాలను HYD సీసీఎంబీలో పరిశీలించగా.. ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యింది. ఆమెకు సన్నిహితంగా ఉన్న 14 మందికి కరోనా టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు.
Read More »ముంబైలో కరోనా కలవరం
ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో 5,428 కోత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల 2,510 అధికం. అటు మహారాష్ట్రవ్యాప్తంగా 8,067 కేసులు నమోదయ్యాయి. 8 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.
Read More »