తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 313 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనా నుంచి 142 మంది బయటపడగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,360కి చేరుకోగా, 2,98,262 మంది కోలుకున్నారు. ఇప్పటిరకు మహమ్మారివల్ల 1664 మంది మృతిచెందారు. మరో 2434 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 943 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా మృతుల రేటు 0.55 …
Read More »దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతున్నది. నిన్న దాదాపు 36వేలకుపైగా కొత్త కేసులు రికార్డవగా.. తాజాగా 40వేలకు చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,726 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,15,14,331కు పెరిగింది. కొత్తగా 20,654 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,10,83,679 డిశ్చార్జి అయ్యారని …
Read More »తెలంగాణలో కొత్తగా 278 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 278 పాజిటివ్ కేసులు నమోదవగా, 111 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,047కు చేరింది. ఇందులో 2,98,120 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1662 మంది మృతిచెందారు. ఇంకా 2265 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇందులో 830 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో రికవరీ రేటు 98.69 శాతంగా ఉందని, మృతుల …
Read More »కామారెడ్డి జిల్లాలో కరోనా కలవరం
తెలంగాణలో కామారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో కరోనా కలకలం సృష్టించింది. పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలోని ఆరుగురు టీచర్లకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాఠశాల విద్యార్థినులకూ పరీక్షలు నిర్వహించగా 32 మందికి పాజిటివ్ వచ్చింది. కానీ విద్యార్థినుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి …
Read More »ఈ రోజు (17న) సీఎంలతో ప్రధాని సమావేశం… దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారా?
ఇండియాలో కరోనా ఏ రేంజ్లో పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాగే ఊరుకుంటే కొంపలు మునుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి జరగనుంది. ఇందులో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో మోదీ తెలుసుకోనున్నారు. ఏం చెయ్యాలో చెప్పనున్నారు. ఈ సందర్భంగా… మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్లు ప్రకటించమని …
Read More »కరోనా టీకా తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్
ఇటీవల కరోనా టీకా తీసుకున్నప్పటికీ ఓ మంత్రికి కొవిడ్ టెస్టులో పాజిటివ్గా నిర్ధారణ అయింది. గుజరాత్కు చెందిన మంత్రి ఈశ్వర్సిన్హ్ పటేల్ కొద్ది రోజుల క్రితం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి తన ట్విటర్ పేజీలో వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసులు క్రమంగా అధికమవుతూ వస్తున్నాయి. నిన్న 25 వేల పైచిలుకు కేసులు నమోదవగా, ఇవాళ ఆ సంఖ్య 26 వేలు దాటింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 26,291 పాజిటివ్ కేసులు నమోదవగా, 118 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా, మరణాలు 1,58,725కు చేరుకున్నాయి. మొత్తం కేసుల్లో …
Read More »జీహెచ్ఎంసీలో తగ్గిన కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 35 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,292 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »తెలంగాణలో కొత్తగా 157 కరోనా కేసులు
తెలంగాణలో గత రాత్రి గం.8 వరకు కొత్తగా 157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,318కు పెరిగింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,654కు చేరింది. నిన్న కరోనా నుంచి 166 మంది కోలుకోగా రాష్ట్రంలో ప్రస్తుతం 1,983 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »జీహెచ్ఎంసీలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడిచిన 24 గంటల్లో మరో 46 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 81,257 కరోనా కేసులు నమోదయ్యా యి. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో టెస్టులు చేయించుకోవాలని సూచించారు
Read More »