అప్పట్లో రక్తం దొరక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో ఎవరూ మరణించకూడదనే సంకల్పంతో 1998 చిరంజీవి బ్లడ్బ్యాంక్ను ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి అందిన రక్తంతో ఎంతోమంది ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇప్పుడాయన మరో సంకల్పానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశవాప్తంగా కరోనా బాధితులు రోజురోజుకి పెరుగుతున్నారు. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. దీనికి కొంత కారణం ఆక్సిజన్ కొరత. దాని వల్ల ఎవరూ మరణించకూడదనే ఆలోచనతో ఆయన ఆక్సిజన్ …
Read More »సమంత గొప్ప మనస్సు
ప్రత్యూష ఫౌండేషన్, దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హీరోయిన్ సమంత.. మహబూబ్నగర్ జనరల్ దవాఖానకు 10 ఆక్సిజన్ కాన్సన్టర్లను, ఎంఎస్ఎం ల్యాబొరేటరీ ద్వారా 2 ఆక్సిజన్ కాన్సన్టర్లను అందజేశారు. వాటిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆసుపత్రికి అప్పగించారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి ప్రయివేట్ వ్యక్తుల తోడ్పాటు ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.
Read More »కరోనా సెకెండ్ వేవ్ అంతం ఎప్పుడో తెలుసా..?
కరోనా సెకెండ్ వేవ్ పై కేంద్రం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఊరటనిచ్చే కబురు చెప్పింది. జులైతో దీనికి తెర పడే అవకాశాలున్నట్లు వెల్లడించింది. అలాగే 6-8 నెలల తర్వాతే థర్డ్ వేవ్ ఉండొచ్చని.. అయితే రెండో వేవ్ అంత తీవ్ర ప్రభావం చూపించదని అంచనా వేసింది. ‘సూత్ర’ (ససెప్టబుల్, అన్లిడిటెక్టెడ్, టెస్టెడ్ అండ్ రిమూవ్డ్ అప్రోచ్) అనే మోడల్ ద్వారా శాస్త్రవేత్తల బృందం ఈ అంచనాలకు వచ్చింది.
Read More »బ్లాక్ ఫంగస్ ను గుర్తించడం ఎలా…?
నాసికా మార్గం ద్వారా బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. ముక్కుకు ఎండోస్కోపీ చేయడం సహా CT స్కాన్ ద్వారా ఇన్ఫెక్షన్ గుర్తిస్తారు. ఇక మెదడుకు, కంటికి ఈ వ్యాధి సోకిందో లేదో MRI స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నియంత్రణలో లేని డయాబెటిస్.. స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్ థెరపీలో, వెంటిలేటర్పై బాధితుడిని ఉంచడం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది.
Read More »సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ పై ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగసు నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించింది. దీనికి సంబంధించి కేసులు ఎక్కడ నమోదైనా తమకు సమాచారం అందించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివరాలు అందించాలని తెలిపింది.
Read More »రోజుకు 90 లక్షల మందికి టీకా తప్పకుండా వేయాల్సిందే..లేకపోతే..?
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం ఆందోళన కల్గిస్తోందని NDTV కో-ఫౌండర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేశారు. 4 వారాల కింద రోజుకు 22 లక్షల మందికి, 2 వారాల కింద 20 లక్షల మందికి, వారం క్రితం 19 లక్షల మందికి టీకా ఇస్తే మే 19న మాత్రం 13 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కరోనాపై విజయం సాధించాలంటే రోజుకు 90 లక్షల మందికి …
Read More »కరోనా రోగులకు ధైర్యం.. డాక్టర్లకు అభినందన : సీఎం KCR
హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. కరోనా రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యతను పరిశీలించి చర్చించనున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా …
Read More »పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనా
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనాకు పాజిటివ్గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. అలాగే ఆయన భార్య మీరా భట్టాచార్య సైతం వైరస్ బారినపడ్డారు. దీంతో ఆమె మంగళవారం సాయంత్రం నగరంలోని ఓ ఆసుపత్రిలో చేరారని సంబంధిత వర్గాలు తెలిపాయి. బుద్ధదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి, వారి సహాయకుడి నుంచి ఉదయం నమూనాలను సేకరించగా.. ఫలితాల్లో పాజిటివ్గా …
Read More »కరోనాతో మరణించిన యూపీ మంత్రి
కరోనా మహమ్మారికి మరో రాజకీయ ప్రముఖుడు బలయ్యారు. ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ కరోనాతో కన్నుమూశారు. 56 ఏండ్ల కశ్యప్ కరోనా బారినపడటంతో గుర్గావ్లోని వేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించడటంతో ఆయన మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. మంత్రి ముజఫర్నగర్లోని ఛర్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు కరోనా వల్ల మరణించారు. కశ్యప్ …
Read More »కొవిడ్ కట్టడిలో తెలంగాణ మార్గదర్శి
కొవిడ్ నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. కొవిడ్ కట్టడికి తెలంగాణ మార్గదర్శిగా మారిందని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. మీడియాతో డీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2 వారాలుగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా తగ్గిందన్నారు. ఇంటింటి సర్వే ద్వారా కరోనా బాధితులను గుర్తించి మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. చికిత్స అవసరం ఉన్నవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో …
Read More »