Home / Tag Archives: carona negative rate (page 23)

Tag Archives: carona negative rate

TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా

ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.

Read More »

నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోనిచార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రిలో శుక్రవారం62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు… వీరిలో39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

Read More »

సర్జరీ చేయించుకునే వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలా..?వద్దా..?

లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేయాలని.. సర్జరీలు చేయించుకునే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్జరీ చేయించుకునే వారిలో లక్షణాలు ఉన్నప్పుడే నిర్ధారణ పరీక్షకు వెళ్లాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయ్యాక తీసుకోవాల్సిన చికిత్సపై వైద్యుల సలహాను తప్పనిసరిగా పాటించాలంది. N95 మాస్కును రోజంతా.. క్లాత్ మాస్కును 8 గంటలకోసారి మార్చి కొత్తది ధరించాలని కేంద్రం పేర్కొంది.

Read More »

ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,816 టెస్టులు చేయగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 418 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.

Read More »

దేశంలో కొత్తగా 2,47,417 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,47,417 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 27 శాతం అధికంగా వెలుగు చూశాయి. బుధవారం 84,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగింది. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి పెరిగింది.

Read More »

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది. అన్ని దేశాల్లో కలిపి ఒక్కరోజు వ్యవధిలోనే 31 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్క అమెరికాలోనే 8 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. అన్నిదేశాల్లో కలిపి కరోనా వల్ల మరో 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 31 కోట్ల 93 లక్షలకు చేరువైంది.

Read More »

నిబంధనలు పాటించకపోతే రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై మంత్రి కేటీఆర్ క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విటర్లో నిర్వహించిన #askktrలో భాగంగా ఓ నెటిజన్ లాక్ డౌన్ గురించి ప్రశ్నించాడు. దానికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. కరోనా కేసుల సంఖ్య, వైద్యశాఖ అధికారుల సలహాను బట్టి లాక్డౌన్ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కాగా.. తెలంగాణలో 18,339 యాక్టివ్(నిన్నటి వరకూ) కేసులున్నాయి. రోజుకు దాదాపు 2000కేసులు వెలుగు …

Read More »

ఏపీలో కొత్తగా 4,348మందికి కరోనా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా చేరుకుంటోంది. గడిచిన 24 గంటల్లో 47,884 మందికి పరీక్షలు చేయగా 4,348మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 14,204యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తంగా 20,92,227కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. మొత్తం 14,507 మంది కరోనా కారణంగా మరణించారు.

Read More »

పిల్లల్లో కరోనా కేసులు నిర్ధారణ లక్షణాలివే…

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పిల్లల్లో కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉన్న కొందరు చిన్నారులను టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు.. ఇద్దరికి ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో 101-102 డిగ్రీల జ్వరం, 3 విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే టెస్టు చేయించాలని సూచిస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat