తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి …
Read More »హైదరాబాద్కు చేరుకున్న కరోనా టీకా
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ర్టానికి రానే వచ్చింది. మంగళవారం ఉదయం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడ్నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్ను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు. 6.5 లక్షల డోసుల కొవిడ్ టీకాలు ఉదయం 11 గంటల సమయంలో రాష్ర్టానికి చేరుకున్నాయి. మరికాసేపట్లో శంషాబాద్ నుంచి కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి టీకా డోసులను తరలించనున్నారు. కోఠి ఆరోగ్య కార్యాలయంలో …
Read More »సైనా నెహ్వాల్కు కరోనా పాజిటివ్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్కు కరోనా పాజిటివ్గా తేలింది. థాయ్లాండ్ ఓపెన్లో పాల్గొనడానికి బ్యాంకాక్ వెళ్లిన భారత బ్యాడ్మింటన్ బృందంలో ఆమె ఉన్నారు. సోమవారం ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఇవాళ ఫలితాలు వెల్లడించారు. మరి కాసేపట్లో థాయ్ ఓపెన్ ప్రారంభం కానుండగా సైనాకు కరోనా నిర్ధారణ కావడం క్రీడాభిమానులను షాక్కు గురి చేసింది. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆమె… తాజా టోర్నీతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. …
Read More »తెలంగాణలో కొత్తగా 351 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా 351 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కు చేరగా, 1565 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 2,83,463 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 4756 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, నిన్న కొత్తగా 415 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 2584 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. …
Read More »దేశంలో కొత్తగా 18,222 కరోనా కేసులు
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఇందులో 1,00,56,651 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,24,190 కేసులు యాక్టివ్గా ఉండగా, ఇప్పటివరకు 1,50,798 మంది బాధితులు కరోనా మహమ్మారి వల్ల మృతిచెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 228 మంది మరణించారు. కొత్తగా 19,253 మంది ప్రాణాంతక వైరస్ నుంచి కోలుకున్నారని …
Read More »అమెరికాలో కరోన విలయతాండవం
అమెరికాలో కరోనా రెండో వేవ్ మొదలైనట్లు ఉంది. కేవలం ఒక్కరోజులోనే ఏకంగా మూడు లక్షల కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 3,976మంది కరోనా భారీన పడి మృతి చెందారు. అయితే కరోనా మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు ఒక్కరోజులోనే అత్యధిక కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారి. అంతకుముందు రోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల మంది కరోనాతో చనిపోయారు. …
Read More »తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 472 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల కేవలం ఇద్దరు మాత్రమే మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410గా ఉంది. మొత్తం రికవరీలు 2,81,872 మంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »దేశంలో తాజాగా 16వేల కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి 16 వేలకు పడిపోయాయి. నిన్నటికంటే ఈరోజు 9 శాతం తక్కువ కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,505 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,03,40,470కు చేరింది. ఇందులో 2,43,953 మంది బాధితులు …
Read More »కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది..
ఇండియాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్తోపాటు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. అత్యవసర సమయంలో పరిమిత వినియోగానికి అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. ఆదివారం మీడియాతో మాట్లాడిన డీసీజీఐ అధికారులు.. ఈ మేరకు రెండు టీకాల వినియోగానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. …
Read More »డ్రై రన్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..?
డమ్మీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డై రన్ అంటారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం,లోపాలను గుర్తించేందుకు డై రన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ వేయాలా? వద్దా? అని నిర్ణయించటం తదితర అంశాలను ఇందులో పరిశీలిస్తారు
Read More »