దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 6,594 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో(8,084) పోలిస్తే ఈ రోజు 1490 కేసులు తగ్గాయి. ఇదే సమయంలో వైరస్ నుంచి 4,035 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 50,548 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు.
Read More »కేన్ విలియమ్సన్ కి కరోనా పాజిటీవ్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొవిడ్ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్ పాజిటివ్గా తేలినట్టు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. దీంతో కేన్ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్కు టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్ స్థానంలో హమిష్ రూథర్ఫర్డ్ జట్టులోకి వచ్చాడు.
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో రెండు వారాలుగా కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది.దీంతో క్రమంగా రోజువారీ కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. 5,24,761 మంది మరణించారు. మరో …
Read More »దేశంలో కరోనా కలవరం
గత వారంరోజులుగా దేశ వ్యాప్తంగా కొత్తగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఏడు వేలకుపైగా నమోదవుతున్నాయి.ఈ రోజు కొత్త కరోనా కేసుల సంఖ్య 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. …
Read More »దేశంలో కొత్తగా 3714 కరోనా కేసులు
గత వారం రోజులుగా దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 3714 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ సంఖ్య 5233కు పెరిగింది. ఇది నిన్నటికంటే 41 శాతం అధికం. దీంతో మొత్తం కేసులు 4,31,90,282కు చేరాయి. ఇందులో 4,26,36,710 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,715 మంది మృతిచెందగా, 28,857 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, 1881 మంది …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో గత వారం రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,714 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 2,513 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 26,976 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 194.27 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
Read More »బాలీవుడ్ లో కరోనా కలవరం -ఉలిక్కిపడ్డ సినిమా ఇండస్ట్రీ
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా పలువురు నటులు వైరస్ బారిన పడటానికి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ బర్త్ డే వేడుకలే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. మే 25న తన 50వ బర్త్ డే వేడుకల్ని యశ్జ్ స్టూడియోలో కరణ్ ఘనంగా చేసుకున్నారు. షారూక్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వీరిలో కనీసం 50 మంది కరోనా బారిన పడ్డారన్న వార్తలొస్తున్నాయి. షారూక్, కత్రినా, …
Read More »దేశంలో కరోనా కలవరం .. ఇక మాస్కు తప్పనిసరా..?
గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,518 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 9 మంది చనిపోయారు. 2,779 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 1.03 శాతం ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా ఉంది.
Read More »దేశ వ్యాప్తంగా కొత్తగా 4,270 మందికి కరోనా
దేశంలో గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 4,270 మంది కరోనా బారిన పడ్డట్లు నిర్ధారణ అయింది. 2,619 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 5,24,692కి చేరింది. కాగా.. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 24,052 ఉన్నాయి. నిన్న 3,962 కేసులు నమోదయ్యాయి.
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,745 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా వైరస్ బారినపడి ఆరుగురు మృతి చెందారు.. మరో 2,236 మంది బాధితులు కోలుకొని డిశార్జి అయ్యారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,386 ఉన్నాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 0.60శాతంగా ఉందని పేర్కొంది.
Read More »