Home / Tag Archives: carona death rate (page 49)

Tag Archives: carona death rate

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గురువారం సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు కొత్త‌గా 3,660 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. కొవిడ్‌-19తో 23 మంది మ‌ర‌ణించారు. 4,826 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా కేసుల‌తో క‌లుపుకుని రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య 5,44,263గా ఉంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 45,757. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 3060 మంది చ‌నిపోయారు. జిల్లాల వారీగా …

Read More »

క‌రోనాతో మ‌ర‌ణించిన‌ యూపీ మంత్రి

క‌రోనా మ‌హ‌మ్మారికి మ‌రో రాజ‌కీయ ప్ర‌ముఖుడు బ‌ల‌య్యారు. ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ క‌రోనాతో క‌న్నుమూశారు. 56 ఏండ్ల క‌శ్య‌ప్ క‌రోనా బారిన‌ప‌డ‌టంతో గుర్గావ్‌లోని వేదాంత ద‌వాఖాన‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించ‌డ‌టంతో ఆయ‌న మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి తుదిశ్వాస విడిచారు. మంత్రి ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లోని ఛ‌ర్త‌వాల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. కాగా, సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ మంత్రివర్గంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు మంత్రులు క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించారు. క‌శ్య‌ప్ …

Read More »

తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 27మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 5,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50,969 కోవిడ్-19 యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో 658, రంగారెడ్డి 326, మేడ్చల్ 293, కరోనా కేసులు బయటపడ్డాయి. తెలంగానలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

Read More »

కరోనా టీకాపై శుభవార్త

ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది. ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పింఛన్ డాక్యుమెంట్ చూయించి టీకా వేసుకోవచ్చని పేర్కొంది.

Read More »

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 4,801 పాజిటివ్ కేసులు.. 32 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో కరోనా కేసుల సంఖ్య 5,06,988కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 2,803 మంది మృతి చెందారు. కరోనా నుంచి 4,44,049 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.. రాష్ట్రవ్యాప్తంగా 60,136 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒక్క రోజులో 75,289 నమూనాలను పరీక్షించారు.

Read More »

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా వరంగల్ జైలు

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ సెంట్రల్ జైలును యుద్ధప్రాతిపదికన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతమున్న ఎంజీఎం సరిపోకపోవడంతో 73 ఎకరాల్లో విస్తరించి ఉన్న జైలు ప్రాంగణంలో ఆస్పత్రి నిర్మించాలన్నారు. ఐసీయూలు, ఆక్సిజన్ ప్లాంట్, క్రిటికల్ కేర్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలని చెప్పారు. జైలును వరంగల్ శివారులోని ధర్మసాగర్ పరిసర ప్రాంతాలకు తరలించాలని సూచించారు.

Read More »

మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి. ప్రసాదరావు కన్నుమూశారు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1979 IPS బ్యాచ్కు చెందిన ప్రసాదరావు ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ, విశాఖ ఎస్పీగానూ పనిచేశారు. 1997లో భారత పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పతకం అందుకున్నారు. ‘వర్డ్ పవర్ టు మైండ్ పవర్’ అనే పుస్తకాన్ని రాశారు.

Read More »

మామిడి పండ్లను పంపుతున్న పూజా హెగ్డే

సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు హీరోయిన్, అందాల రాక్షసి పూజా హెగ్దే మామిడి పండ్లు పంపుతోంది. కర్ణాటకలోని మంగళూరు వద్ద ఆమెకు మామిడి తోట ఉండగా.. ఈ సారి మంచి దిగుబడి వచ్చింది. దీంతో పరిశ్రమలో తెలిసిన వారికి మామిడి పండ్లు పంపుతుండగా.. తొలిరోజు ఒకరిద్దరు నిర్మాతలు, దర్శకులకు ఈ పండ్ల గిఫ్టులు అందగా, అందుకోవాల్సిన వారు ఇంకా చాలామందే ఉన్నారట.

Read More »

దేశంలో కరోనా కేసులపై ఊరట

దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. వరుసగా 4 రోజులు 4 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో 3,66,161 పాజిటివ్ కేసులు వచ్చాయి. 3,754 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 2,26,62,575 నమోదు కాగా 2,46,116 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 3,53,818 మంది డిశ్చార్జ్ అయ్యారు. 37,45,237 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న దేశవ్యాప్తంగా 14,74,606 కరోనా టెస్టులు …

Read More »

ఈ కరోనా లక్షణాలుంటే..?

కరోనా విషయంలో వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ సైంటిస్టులు హెచ్చరించారు. ఈ లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలన్నారు. 1. ముఖం, పెదవులు, గోర్లు నీలి రంగులోకి మారడం 2. ఛాతిలో నొప్పి అనిపించడం 3. ఆయాసం, శ్వాస సమస్యలు 4. దగ్గు ఎక్కువ కావడం 5. అలసట ఎక్కువ ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat