దేశంలో కరోనా కేసులు 30 వేల దిగువకు చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 28,591 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,36,921కు చేరింది. ఇందులో 3,24,09,345 మంది బాధితులు కరోనా నుంచి బయటపడగా, ఇంకా 3,84,921 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 4,42,655 మంది బాధితులు వైరస్ వల్ల మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 34,848 మంది కరోనా నుంచి కోలుకున్నారని, …
Read More »దేశంలో కొత్తగా 33,376 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 33,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,08,330కు చేరింది. ఇందులో 3,91,516 కేసులు యాక్టివ్గా ఉండగా, 4,42,317 మంది బాధితులు మరణించారు. మరో 3,23,74,497 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 308 మంది మరణించారని, 32,198 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారని తెలిపింది.ఇక కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ …
Read More »తెలంగాణలో కొత్తగా 329 కొత్త కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 329 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,60,471కు పెరిగింది. తాజాగా 307 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,51,085 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి 24గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 3,889కు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.57శాతం, మరణాల …
Read More »తెలంగాణలో 3.37లక్షల మంది టీచర్లు, సిబ్బందికి వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లకు వందశాతం వ్యాక్సినేషన్ను లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు 3.37 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేశారు. మిగతా వారందరికీ ఈ నెల 10లోపు పూర్తి చేసేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని టీచర్లు, సిబ్బంది అంతా వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నెల 10లోపు వందశాతం వ్యాక్సినేషన్ను చేరుకోవాలని ఆదేశించింది. కనీసం సింగిల్డోస్ వ్యాక్సిన్ …
Read More »దేశంలో కొత్తగా 37 వేల కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 37 వేల కేసులు నమోదవగా, తాజాగా 43 వేల పైచిలుకు కేసులు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 14 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో నమోదైనవే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో బుధవారం 30,196 కేసులు నమోదవగా, 181 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 43,263 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం …
Read More »కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశాం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కంట్రోల్ చేశామని, ప్రస్తుతం వందల్లో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. సనత్నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్తో పాటు 7 అంబులెన్స్లను మంత్రి కేటీఆర్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్లను మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ …
Read More »దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 4,04,874 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,40,752 మంది వైరస్ వల్ల మరణించారు. ఇక ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేవిధంగా తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్ …
Read More »కేరళలో నిఫా కలకలం..
కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. కోజికోడ్లో ఈ వైరస్ బారినపడిన ఓ 12 ఏండ్ల బాలుడు మరణించాడు. నిఫా వైరస్ కారణంగా బాలుడు మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. బాలుడి కుటుంబంలో ప్రస్తుతం ఎవరికి వైరస్కు సంబంధించిన లక్షణాలు లేవని తెలిపారు. కోజికోడ్లో పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పటికే అధికారుల బృంధాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బాలుడిని కలిసినవారిని గుర్తించే పనిని ప్రారంభించామని …
Read More »దేశంలో కొత్తగా 42,766 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,88,673కు చేరింది. ఇందులో 4,10,048 కేసులు యాక్టివ్గా ఉండగా, 3,21,38,092 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,40,533 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. కరోనా రికవరీ రేటు 97.42 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసులు, మరణాల్లో సగానికిపైగా కేరళలోనే ఉన్నాయని తెలిపింది. రాష్ట్రంలో …
Read More »న్యూజిలాండ్లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం
న్యూజిలాండ్లో ఆరు నెలల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ వ్యవస్థపై ఆమె లేకపోయినా శుక్రవారం రాత్రి ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. న్యూజిలాండ్లో కోవిడ్ -19తో చనిపోయిన 27వ వ్యక్తి ఆ మహిళ అని, ఈ ఏడాది ఫిబ్రవరి …
Read More »