తెలుగు సినిమా ఇండస్ట్రీకి కరోనా మహమ్మారి సెగ తగిలినట్లు ఉంది.సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఆ విషయం మరిచిపోకముందే మరో నటికి కరోనా సోకింది.మంచు కుటుంబానికి చెందిన మంచు లక్ష్మీకి కరోనా సోకినట్లు తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. గత రెండేండ్లుగా కరోనాకు దొరక్కుండా దాగుడుమూతలు ఆట ఆడుకున్నాను.కానీ ఈసారి మాత్రం కరోనా నన్ను దొరకబుచ్చుకుంది.నాకు స్వల్ప లక్షణాలే …
Read More »మహేష్ బాబు అభిమానులకు Bad News
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కరోనా కలవరం సృష్టిస్తుంది..ఇటీవల యువహీరో మంచు మనోజ్ కరోనా బారీన పడిన సంగతి మరిచిపోకముందే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో…ప్రిన్స్ మహేష్ బాబు కూడా కరోనా బారీన పడ్డారు. ఈ విషయం గురించి మహేష్ బాబు స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశాడు..నేను నిన్న కొవిడ్ పరీక్ష చేసుకుంటే పాజిటీవ్ అని తేలింది.స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికి ఇంట్లోనే వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ …
Read More »తెలంగాణలో కొత్తగా 1913 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు నాలుగు రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది… తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,913 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. అంతేకాకుండా గత ఇరవై నాలుగంటల్లో కరోనా బారీన పడి ఇద్దరు మరణించారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 1,214 కేసులు ఒక్క రాజధానిమహానగరమైన హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. నిన్న గురువారం కొత్తగా …
Read More »తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య పెంపు
తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజుగా పెరుగుతున్న కరోనా, ఒమిక్రాన్ కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సుమారు 40వేల పరీక్షలు చేస్తున్నారు. తాజాగా ఆ సంఖ్యను లక్షకు పెంచాలని వైద్యారోగ్య శాఖ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇంటి వద్దే యాంటీజెన్ టెస్టు చేసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు 2 కోట్ల ర్యాపిడ్ …
Read More »చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ ..?
ప్రస్తుతం కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. దీని ప్రత్యేక లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పటివరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో లండన్ కింగ్స్ కాలేజీ దీని లక్షణాలపై అధ్యయనం చేసింది. కొన్ని సింప్టమ్స్ తెలియజేసింది. సాధారణ కోవిడ్ లక్షణాలతో పాటు.. చర్మంపై అసాధారణ దద్దుర్లు, దురద ఉంటే అది ఒమిక్రాన్ కావొచ్చని తెలిపింది. ఇలాంటి పరిస్థితిలో ఎరుపు, దురద దద్దుర్లను గమనించాలని సూచించింది.
Read More »గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 979 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,48,873 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ఓవైపు కరోనా కేసులు, మరోవైపు ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు
Read More »ఒమిక్రాన్ బారినపడి 108 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఒమిక్రాన్ బారినపడి 108 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాల్లో 4,70,462 ఒమిన్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. యూకేలో అత్యధికంగా 2,46,780 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా, డెన్మార్క్ 57,125, USA 42,539, జర్మనీలో 35,529 చొప్పున కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు వివరించింది. కాగా దేశంలో ప్రస్తుతం 2,135 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు తెలిపింది.
Read More »మహారాష్ట్రలో ఒమిక్రాన్ భయోత్పాతం
మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ భయోత్పాతం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో అక్కడ 144 మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఒక్క ముంబైలోనే 100 కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూశాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాగా గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో 26,538 కరోనా కేసులు నమోదయ్యాయి. 8 మంది బాధితులు మహమ్మారికి బలయ్యారు. రికవరీ రేటు 96.55శాతానికి తగ్గింది.
Read More »దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం
దేశంలో రోజు రోజుకి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నప్పటికీ మరణాలు లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. అయితే తాజాగా తొలి ఒమిక్రాన్ మరణం నమోదయింది. రాజస్థాన్లో ఒమిక్రాన్ సోకిన 72ఏళ్ల వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవల మహారాష్ట్రలో ఓ బాధితుడు ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్లు వార్తలు రాగా.. అది ఒమిక్రాన్ మరణం కాదని తేలింది.
Read More »బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం
బీహార్ కేబినేట్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇద్దరు డిప్యూటీ సీఎంలు రేణూ దేవీ, తారా ప్రసాద్ సహా మంత్రులు సునీల్ కుమార్, విజయ్ చౌదరి, అశోక్ చౌదరిలకు కరోనా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. పంజాబ్లోను కరోనా విలయతాండవం చేస్తోంది. శిరోమణి ఆకాలిదళ్ అధ్యక్షుడు సుఖేవ్ సింగ్ ధిండా కరోనా బారిన పడ్డారు.
Read More »