కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »మధ్యాహ్నం సాయిచంద్ అంత్యక్రియలు
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకాల మరణం చెందారు. బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫామ్హౌస్కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ గుండెపోటు రావడంతో.. చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని …
Read More »త్యాగానికి ప్రతీక బక్రీద్..
త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం గారు శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నాడు ఐజ మున్సిపాలిటీ లో ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ నిలుస్తుందని, మనకు కలిగిన ప్రయోజనాలను జనులందరికీ సమానంగా అందించినపుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందని ఎమ్మెల్యే …
Read More »త్యాగానికి ప్రతీక బక్రీద్ : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి సాయినగర్ దేవేందర్ నగర్ ఈద్గాలో ముస్లీంల పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్- ఉల్- ఆదా)ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే గారు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ …
Read More »సాయిచంద్ మృతి తీరనిలోటు : సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ..
తన పాట మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని పదునెక్కించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు మిత్రుడు సాయి చంద్ గారి మృతి పట్ల సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసి సంతాపాన్ని తెలిపారు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా కొనసాగుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో సైతం ప్రజలను చైతన్యపరుస్తున్న సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నాను. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో యువకుడిగా గాయకుడిగా …
Read More »సాయిచంద్ అకస్మిక మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి
తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం వొక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న …
Read More »అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్ )పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా …
Read More »బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే మిషన్
బీఆర్ఎస్ను తెలంగాణ పార్టీ అంటున్నారని.. కానీ బీఆర్ఎస్ భారతదేశ గతిని మార్చే, పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సర్కోలి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. మన దేశానికి ఏదైనా లక్ష్యం ఉందా లేక మనం దారి తప్పి చీకట్లో మగ్గుతున్నామా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సిన అనివార్య …
Read More »టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్
హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షకకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్ షీట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. వెబ్సైట్ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. రేపటి నుంచి జులై ఒకటో తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఆన్లైన్లో ఇంగ్లిష్లో మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.జులై 26 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్న రెస్పాన్స్ షీట్లు వెబ్సైట్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. …
Read More »ఆగస్టు చివరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు – మంత్రి హరీష్ రావు..
ఆగస్ట్ చివరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులపై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు చివరి వారంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, కార్డులు ఇచ్చేందుకు అంతా సిద్ధమైందని తెలిపారు. ఆగస్టు చివరి వారంలో కొత్త పెన్షన్లు కూడా వచ్చేలా చూస్తామని చెప్పారు. మరోవైపు 2014 నుంచి …
Read More »