ఏపీలో తెలంగాణలో ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం 42వ ఆవిర్భావ దినోత్సవ సభను ఈ నెల 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఆ పార్టీ తెలంగాణ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల …
Read More »రావినూతలకు చేరుకున్న సీఎం కేసీఆర్
వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రావినూతలకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్ నుంచే పరిశీలించారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
Read More »చింతల్ డివిజన్ చంద్రానగర్, ఓల్డ్ చింతల్ కాలనీల్లో పాదయాత్ర
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ 128 డివిజన్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 29వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రానగర్, ఓల్డ్ చింతల్ కాలనీల్లో పాదయాత్ర చేస్తూ దాదాపు పూర్తి చేసిన సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ తదితర పనులు పరిశీలించారు. కాగా చంద్రానగర్ లో రూ.1.90 కోట్లతో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేసిన నేపథ్యంలో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ …
Read More »పేదలకు కొండంత అండ కళ్యాణలక్ష్మీ పథకం – ఎమ్మెల్యే చల్లా…
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం నందనాయక్ తండాకు చెందిన ఒకరికి , గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15వ …
Read More »వర్షప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
వర్షప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన అకాల వడగండ్లు, వర్షాలకు పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంటలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా నష్టపోయిన పంటల్ని స్వయంగా పరిశీలించనున్నారు. అదే విధంగా చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. భారీ వర్షాలు కురిసిన వెంటనే సీఎం కేసీఆర్ ఆదేశాల …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరుష పదాలతో ట్వీట్ చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ లో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి, మంత్రులను అసభ్యమైన పదజాలంతో దుర్భాషలాడుతూ.. అవమానకరంగా మాట్లాడుతున్నా సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కన్నడ నటుడు చేతన్ ను అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్కు తరలించిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలోనూ …
Read More »ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగింటి నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా.. ప్రజలంతా ప్రగతిపథంలో ముందుకు సాగాలని కవిత పేర్కొన్నారు. ప్రతి ఇంటా ఆరోగ్యం – ఆనందంతోపాటు సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అని కవిత తన …
Read More »ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి… బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది అని కేటీఆర్ పేర్కొన్నారు. గతించిన కాలాన్ని మరిచిపోయి, కొత్త ఏడాది కి ఘన స్వాగతం పలుకుదాం అని పేర్కొన్నారు. ఈ ఏడాది పొడవునా విజయం, అదృష్టం మీ వెంటే ఉండాలని ఆకాంక్షిస్తూ.. శ్రీ శోభకృత్ …
Read More »తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లోకి డబ్బులు జమ
రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జి.) ఖాతాల్లోకి బ్యాంకర్లు సోమవారం రూ.217 కోట్లు జమ చేసినట్లు మంత్రి హరీశ్రావు మీడియాకు తెలిపారు. బ్యాంకులు గతంలో అధికంగా వసూలుచేసిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో వేసినట్లు ఆయన వివరించారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలో… 2022 జూలై 20న బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. రూ.3 లక్షల వరకు రుణంపై …
Read More »రైతులు ధైర్యంగా ఉండాలి-మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న రైతులు ధైర్యంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ములుగు జిల్లా రంగాపూర్ లో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి తోటను మంత్రి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. రైతులు కష్టపడి సాగు చేసిన పంటలు అకాల వర్షంతో దెబ్బతినడం బాధాకరమన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి …
Read More »