రైతుల మేలు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని, నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. వేంసూరు మండలం, వేంసూరులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ప్రారంభించారు. దేశంలోనే ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం …
Read More »భిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ..
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం లో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తుందని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అన్నారు.బిన్న సంస్కృతులకు నిలయం తెలంగాణ అనీ,ఇక్కడ ఆచారాలు, బిన్న సాంప్రదాయాలకు దేశం లోనే తెలంగాణ ప్రత్యేకం అన్నారు .ఆత్మకూర్ ఎస్ మండలం నశీంపేట లో బొడ్రాయి పండుగ మహోత్సావం లో పాల్గొన్న మంత్రి ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లోసర్వమత సమ్మేళనాల మరిమళానికి …
Read More »కుత్బుల్లాపూర్ డివిజన్ దత్తాత్రేయ నగర్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పాదయాత్ర…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 45వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ నగర్ లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అన్నీ సీసీ రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. రూ.1 కోటి సీఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులు పరిశీలించారు. …
Read More »మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ & టూరిజం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీ లో భాగంగా నీరా ప్రాసెసింగ్, బాటిలింగ్ లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు …
Read More »క్రీడ హబ్ గా తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నేటి నుండి మే 31 తేదీ వరకు నిర్వహిస్తున్న వార్షిక సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహణపై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరణ లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి.రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు …
Read More »ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళుతుందని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. లక్షెట్టిపేట మున్సిపల్ కార్యాలయ ప్రాంగణములో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నదని చెప్పారు. బతుకమ్మ పండుగ కి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తున్నట్లు రంజాన్ క్రిస్మస్ పండుగలకు దుస్తులు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో …
Read More »‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 44వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 44వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్, సురేందర్ నగర్ కాలనీల్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పాదయాత్ర చేస్తూ దాదాపు 85 శాతం వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ, డ్రైనేజీ పూర్తైన వెంటనే సీసీ రోడ్లు, ట్రాన్స్ఫార్మర్ …
Read More »ఈ నెల 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ఈ నెల 30న ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఈ నెల 24 నుంచి అన్ని ప్రభుత్వశాఖల కార్యాలయాల తరలింపును ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది. BRK భవన్లో ఉన్న ఫర్నిచర్ తీసుకురావొద్దని, కొత్త సచివాలయంలో పూర్తిస్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అందుకున్న మహేశ్వర్ రెడ్డి.. ఇవాళ గురువారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ ఇచ్చే అధికారం TPCCకి లేదని, తాను పార్టీ మారడం లేదని ఆయన నిన్న స్పష్టం చేశారు. ఖర్గేతో తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
Read More »కారేపల్లి ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి సమీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాలవడం బాధాకరమన్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా …
Read More »