తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని ఆర్.కె.కన్వెన్షన్ లో నియోజకవర్గ స్థాయి తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ సదస్సు లో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు,జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు. ఈ కార్యక్రమంలో పరకాల,నడికూడ,పరకాల మున్సిపాలిటీ, ఆత్మకూరు,దామెర,గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని మహిళా ప్రజాప్రతినిధులు,అన్ని శాఖల మహిళా అధికారులు,ఐసిడిఎస్ సి.డి.పి. ఓ., సూపర్వైసర్స్, అంగన్వాడీ టీచర్లు,ఆయాలు,ఐ.కే.పి. ఏ.పి.ఎం.లు,వి.ఓ. ఏ.లు, …
Read More »వేంసూరులో పర్యటించిన ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం, గూడూరు గ్రామంలో నూతనంగా నిర్మాణమైన శ్రీ ఆంజనేయ స్వామి, నాగేంద్ర స్వామి విఘ్నేశ్వర స్వామి, ముత్యాలమ్మ, అక్కలమ్మ పోతురాజు, విగ్రహాల ప్రతిష్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తం, గ్రామ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమనికి సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు హాజరై నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేందుకు భక్తి, ఆధ్యాత్మిక భావన అవసరమని …
Read More »మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో ఆడబిడ్డలకు బట్టలు పంపిణీ
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన సొంత ఖర్చుతో బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం “తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 12వ రోజు “మహిళ సంక్షేమ దినోత్సవం” సందర్భంగా గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు,అలాగే అంగన్వాడి ఆయాలకు బాల్కొండ మండల కేంద్రంతో పాటు,కిసాన్ నగర్,వన్నెల్(బి),బోదేపల్లి,చిట్టాపూర్,శ్రీరాంపూర్,జలాల్పూర్,నాగపూర్,బస్సాపూర్,ఇత్వార్ పేట్ గ్రామాలకు చెందిన మహిళ పారిశుద్ధ్య కార్మికులకు,అంగన్వాడీ మహిళా ఆయాలకు ఈరోజు ప్రజాప్రతినిధులు,నాయకులు …
Read More »వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి, ఆరు పదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా మనసున్నముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ కాపాడుతోందన్నారు మంత్రి కేటీఆర్. ‘ఆకాశంలో సగం కాదు.. ఆమే ఆకాశం. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం. మహిళా సంక్షేమంలో మన తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శం’ అని అన్నారు. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ మహిళా సంక్షేమ దినోత్సవం నిర్వహిస్తున్న …
Read More »కుత్బుల్లాపూర్ లో అట్టహాసంగా “తెలంగాణ రన్”…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో “తెలంగాణ రన్” అట్టహాసంగా జరిగింది. ఈ రన్ కు ముఖ్య అతిథులుగా హాజరైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర గారు, అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్య ఐఎఎస్ గారు, జోనల్ కమిషనర్ మమత గారు, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. …
Read More »ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన యువనేత.. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. కరీంనగర్-వరంగల్ హైవేపై శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఆయన ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడంతో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కారులోని ఇతర వ్యక్తులకు కూడా గాయాలేమీ కాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు విచారిస్తున్నారు.
Read More »ఈనెల 15న తెలంగాణకి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 15న తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 15న ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో శ్రీసీతారాములవారిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు ఖమ్మంలో జరిగే బహిరంగసభలోపాల్గొంటారు. సభ అనంతరం పార్టీకి చెందిన పలువురు నేతలతో అమిత్ షా విడివిడిగా సమావేశం అవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. తర్వాత శంషాబాద్ చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Read More »దేవరకొండ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు
తెలంగాణ రాష్ట్రంలో దేవరకొండలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రచార రథంపై భట్టి సమక్షంలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలూనాయక్ మాట్లాడుతున్నాడు.. ఈ సమయంలో మరో నేత కిషన్ నాయక్ అనుచరులు అడ్డుకున్నారు. దీంతో బాలూనాయక్ వారిని వారిస్తుండగా.. కిషన్ నాయక్ ఆయనతో గొడవకు దిగారు. భట్టి ఎంత చెప్పినా ఇద్దరూ వినలేదు. దీంతో ఆయన మైక్ తీసుకుని …
Read More »హెల్త్ హబ్గా తెలంగాణ
తెలంగాణ హెల్త్ హబ్గా అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. హైదరాబాద్ నలుమూలలా 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో …
Read More »రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం
రేపటి నుంచి యథావిధిగా స్కూల్స్ ప్రారంభం అవుతున్నప్పటికీ ఒంటిపూట బడులు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జూన్ 17 వరకు ఉ.7.30 నుంచి మ. 11.30 వరకు తరగతులు నిర్వహిస్తామని ప్రకటించింది. ఉ.8.30-9 మధ్య రాగి జావ, ఉ.11.30-మ.12 మధ్య భోజనం పెడతారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నిబంధన వర్తించనుంది. జూన్ 19 …
Read More »