దేశంలోని ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచనుంది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కౌ50వేలుగా ఉంది. దీన్ని 30-35 శాతానికి పెంచనున్నారు. వచ్చే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అయితే ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకొని ఉంటే.. వారికి స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ లభించదు. పాత పన్ను విధానంలో ఈ ప్రయోజనం ఉంటుంది.
Read More »రేపు గోవాకు ప్రధాని నరేందర్ మోదీ
ప్రధాని నరేంద్రమోదీ రేపు గోవాకు వెళ్లనున్నారు. గోవాలో జరుగనున్న గోవా లిబరేషన్ డే ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గోవాలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జి స్టేడియంలో గోవా లిబరేషన్ డే సంబరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా భారత భూభాగాలైన గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆపరేషన్ విజయ్లో పాల్గొన్నవారిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా గోవా, డామన్ …
Read More »ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్ పెల్ గి ఖొర్లో అవార్డును ప్రకటించారు. భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడానికి సంతోషిస్తున్నట్లు భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ అవార్డు ప్రకటనపై ఫేస్బుక్లో ఓ ప్రకటన చేసింది. …
Read More »TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం
దేశంలో ఉన్న బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై TPCC చీఫ్, MP రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీలపై బీజేపీ ప్రేమ కొంగజపం-దొంగజపం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని …
Read More »దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు ఉండగా.. దాన్ని 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. కాగా, అబ్బాయిల కనీస వివాహ వయస్సు 21గా ఉంది. దీంతో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ఈ అంతరం తగ్గించాలని, చిన్న వయస్సులో గర్భం దాల్చడంతో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయనే వాదనల నేపథ్యంలో కేంద్రం …
Read More »కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు ఎన్ని నీళ్ళు అవసరమో తెలుసా..?
సహాజంగా,కిలో వడ్లు ఉత్పత్తి చేసేందుకు దాదాపు 3 నుంచి 5 వేల లీటర్ల నీరు వినియోగం అవుతోందని కేంద్రం తెలిపింది. అందుకే రైతులు ఇతర పంటల వైపు మళ్లాలని సూచించింది. రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు పేర్కొంది. వేరుశనగ, పప్పు, నూనెగింజలు, సోయాబీన్, పత్తి, తృణధాన్యాలు, ఉద్యానపంటలను సాగు చేసిన వారికి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామంది.
Read More »రైతులు చనిపోయారా.. మాకు తెలియదే మా దగ్గర రికార్డులే లేవు
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనోద్యమంలో రైతులు చనిపోయిన విషయం తమకు తెలియదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. రైతుల మరణాలపై తమ దగ్గర రికార్డులేమీ లేవని తెలిపింది. కాబట్టి వారికి ఆర్థిక సాయం చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. ‘ఉద్యమంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఏమైనా ఆర్థిక సాయం అందజేస్తారా’ అని లోక్సభలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ …
Read More »రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు.
రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాలి. అంటూ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఎం పీ లు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్ సభలో టిఆర్ఎస్ పార్టీ నేత నామా నాగేశ్వర రావు, రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, …
Read More »కనీస మద్దతు ధర కల్పించలేము
దేశంలో పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు.. చట్టం తేవడం సాధ్యం కాదన్నారు హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్. ఇది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుందని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు ఈ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు MSPకి చట్టబద్ధత కల్పించాలని దేశవ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read More »ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త కుట్ర
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రుద్దిన నిబంధనలు రైతుల పాలిట శాపంగా మారాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఓటీపీ విధానం రైతులను బాధల సుడిగుండంలోకి నెట్టేసింది. ఆధార్ నంబర్తో ఫోన్ నంబర్ను అనుసంధానం చేయని రైతుల ధాన్యం కొనవద్దని కేంద్రం ఆదేశించడంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నాడు. ఈ నిబంధన కారణంగా చాలామంది రైతులు సకాలంలో ధాన్యం అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి దాపురించింది. …
Read More »