Home / Tag Archives: amith shah (page 63)

Tag Archives: amith shah

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు ఐటీఐఆర్ లేదా దానికి సమానమైన హోదా కల్పించాలని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ‘గత ఆరేళ్లుగా హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధిస్తోంది. ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రత్యేక పాలసీ ద్వారా కేంద్రం ప్రోత్సాహం ఇవ్వాలి. భారతదేశ ఆర్థిక ఇంజినీర్ గా హైదరాబాద్ లాంటి నగరాలు మారుతున్నాయి’ అని కేటీఆర్ …

Read More »

2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న  తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు

Read More »

రామ మందిరానికి విరాళాలు ఎన్నో వచ్చాయో తెలుసా..?

అయోధ్య‌  రామ మందిర నిర్మాణం కోసం విరాళ‌ల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం శ‌నివారంతో ముగిసింది. 44 రోజులపాటు సాగిన ఈ కార్య‌క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది విరాళాలు సేక‌రించారు. మొత్తంగా రూ.2 వేల కోట్ల వ‌ర‌కూ విరాళాలు వ‌చ్చిన‌ట్లు ట్ర‌స్ట్ అధికారులు వెల్ల‌డించారు. అయితే ఇందులో ఇంకా చాలా వ‌ర‌కు డబ్బును ఇంకా బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్న‌ట్లు వాళ్లు తెలిపారు. ఈ ప్ర‌క్రియ మొత్తం పూర్త‌యితే.. విరాళాల మొత్తం మ‌రింత …

Read More »

స్వచ్ఛ పర్యాటక ప్రాంతాల జాబితాలో గోల్కొండ కోట

స్వచ్ఛభారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలను గుర్తించాలన్న ప్రధాని మోదీ సూచనతో అధికారులు 12 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశారు. సాంచీ స్థూపం (MP), గోల్కొండ కోట(TS), దాల్ సరస్సు (శ్రీనగర్), అజంతా గుహలు (MH), ఆగ్రా కోట(UP), కాళీ ఘాట్(WB) కుంభల్ కోట(RJ), జైసల్మేర్ కోట (RJ), రామ దేవా (RJ), రాక్ గార్డెన్ (చండీగఢ్), బాంకే బిహారీ ఆలయం(UP), సూర్య దేవాలయం (OD)ను గుర్తించారు.

Read More »

4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన సీఈసీ

 నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా సునీల్‌ ఆరోరా ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 …

Read More »

సబ్సిడీ సిలిండర్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్

సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.25 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు బుధవారం రాత్రి నిర్ణయించాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నాయి. దీంతో సిలిండర్(14 కేజీల) ధర రూ.846.50కు పెరిగింది. FEBలో మొత్తం మూడు సార్లు గ్యాస్ ధరలు పెరగ్గా.. రూ. 100 మేర భారం పడింది. 4వ తేదీన రూ. 25,15న రూ.50 సహా తాజాగా రూ.25 పెంచడంతో …

Read More »

మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్దార్ వల్లభ్ భాయ్ పేరు తీసేసి మోదీ పేరు పెట్టడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సర్దార్ పటేల్ పేరు కొనసాగుతుందని కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్ రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

Read More »

మోదీ సర్కారు సంచలన నిర్ణయం

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలతో పాటుగా మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైన వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్న సంగతి మనకు తెల్సిందే. ఈ ఒక్క ఫిబ్రవరి నెలలోనే వంట గ్యాస్ సిలిండర్ పై రూ.25లు పెరగడం గమనార్హం. వీటి గురించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ధరల …

Read More »

బీజేపీలోకి పీటీ ఉష

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న కేరళలో ప్రభావం చూపాలని బీజేపీ   ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను ఆకర్షించిన కాషాయ దళం ఇప్పుడు ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉషను తమ పార్టీలోకి చేర్చుకోనుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా గళం విన్పించిన ఉష సహా పలువురు ప్రముఖులు త్వరలోనే బీజేపీలో చేరుతారని కేరళలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్. రామచందర్ రావు నామినేషన్ దాఖలు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,సీఎం కేసీఆర్ కుటుంబం పాలన కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లుందని. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎన్. రామచందర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ   అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే శాసన మండలిలో అన్ని ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వరదలపై మూడేళ్ల క్రితమే టీఆర్ఎస్   ప్రభుత్వాన్ని నిలదీశానని వెల్లడించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat