Home / Tag Archives: amith shah (page 54)

Tag Archives: amith shah

కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ

నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.

Read More »

మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి

ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.

Read More »

ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలోస్తే గెలుపు ఎవరిది..?

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులు 120 స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్కు 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.

Read More »

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ పొత్తు

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.

Read More »

బీజేపీలో చేరిన దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్

దివంగత సీడీఎస్ బిపిన్ రావత్ సోదరుడు విజయ్ రావత్ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. సైన్యంలో కల్నల్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ఆయన ప్రధాని మోదీ ఆలోచనా విధానం నచ్చే కమలం పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. త్వరలో జరగనున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Read More »

శ్రీలంకకు అండగా భారత్

విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరిగిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరోసారి భారత్ సాయం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ నెల మొదట్లో ఆ దేశానికి 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ను, గత వారం 400 మిలియన్ డాలర్లను భారత్ మంజూరు చేసింది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు ఇబ్బందులు …

Read More »

బీజేపీలోకి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ వలసలు జోరుగా సాగుతున్నాయి. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ బీజేపీలో చేరారు. ఈయన 2017 శిరోమణి అకాలీదళ్ చేరి… అప్పటి కాంగ్రెస్ నేత, మాజీ సీఎం అమరీందర్పై పటియాలా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జోగిందర్ 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్ గా పనిచేశారు. 2008-13 మధ్య అరుణాచల్ గవర్నర్ గా ఆయన  సేవలందించారు.

Read More »

Upలో Spకి రాకేశ్ టికాయత్ మద్ధతు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ-రాష్ట్రీయ లోక్ దళ్ కూటమికి మద్దతిస్తున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు జరిగిన రైతుల ఉద్యమంలో టికాయత్ కీలకపాత్ర పోషించారు. సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ తమ ఉద్యమం ఆపబోమని ప్రకటించిన టికాయత్.. ఉత్తరప్రదేశ్ లో ప్రస్తుత అధికార బీజేపీ వ్యతిరేక పార్టీకి మద్దతిచ్చారు.

Read More »

BJP కి షాకిస్తున్న అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొన్నటి వరకు బలంగా కనిపించిన అధికార బీజేపీకి షాకిచ్చేలా.. వలసలను ఆహ్వానిస్తూ తమ పార్టీ బలపడుతోందనే సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,మంత్రులు బీజేపీని వీడి ఎస్పీలో చేరుతున్నారు.. మరోవైపు ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఊగిసలాటలో ఉన్నారట. అఖిలేష్ దెబ్బకు …

Read More »

దేశ ప్రజలకు ప్రధాని మోదీ సంక్రాంతి శుభాకాంక్షలు

పండుగలు భారతదేశ శక్తిమంతమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. పలు రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో జరుపుకునే మకర సంక్రాంతి, మాగ్ బిహు, ఉత్తరాయన్, పొంగల్, భోగీని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ పలు భాషల్లో ట్వీట్లు చేశారు. ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat