Home / Tag Archives: amith shah (page 43)

Tag Archives: amith shah

రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలి

ప్ర‌గ‌తిశీల రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాలే త‌ప్ప అణ‌గ‌దొక్క‌కూడ‌ద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజ‌కీయాల‌కు అతీతంగా అన్ని రాష్ట్రాల‌ను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. రాష్ట్రం బ‌లంగా ఉంటేనే దేశం బ‌లంగా ఉంటుంది. ఉత్ప‌త్తి రంగం బ‌లోపేతానికి కేంద్రం చ‌ర్య‌లు తీసుకోవాలి. కేంద్రం మంచి ప‌ని చేస్తే మెచ్చుకుంటాం.. చెడ్డ ప‌ని చేస్తే విమ‌ర్శిస్తాం అని చెప్పారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజకీయ వ్యూహాలు చేయాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ …

Read More »

మధ్యప్రదేశ్‌ లోనే ఎక్కువగా శిశుమరణాలు

దేశంలో ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మంది మృత్యుఒడిలోకి చేరుకొంటున్నారు. మిజోరంలో అతి తక్కువ శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది శిశువులకు ముగ్గురు మరణిస్తున్నారు. మొత్తంగా ఏడాది నిండకుండానే దేశంలో ప్రతి 36 పసికందుల్లో ఒకరు …

Read More »

ఉద్యోగులకు మోదీ సర్కారు షాక్

ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (ఈపీఎఫ్‌) డిపాజిట్లపై 2021-22కుగాను తగ్గించి ప్రతిపాదించిన 8.1 శాతం వడ్డీరేటును ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు ఆమోదించింది. ఈ మేరకు నిన్న శుక్రవారం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) తెలియజేసింది. ఈపీఎఫ్‌ పథకం సభ్యులందరికీ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 8.1 శాతం వడ్డీరేటును చెల్లించాలన్నదానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు ఈపీఎఫ్‌వో కార్యాలయం …

Read More »

కాంగ్రెస్‌ది తాడు.. బీజేపీ ఉరి

పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేపీ నాయకత్వం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్నది ఇదే. నాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషాన్ని తెలంగాణ ప్రజలకు మిగిల్చని క్రూర మనస్తత్వం బీజేపీది. రాష్ట్రం అధికారికంగా అమల్లోకి రాకముందే పోలవరం ముంపు …

Read More »

మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ షాక్‌

కర్ణాటక మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్‌ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్‌ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప …

Read More »

మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం!

ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి చేరాయి. ఇప్పడు కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర అప్పు చేసే యోచనలో ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ లక్ష కోట్ల అప్పు కోసం మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. …

Read More »

BJP కి ఈటల రాజేందర్ షాక్

గతంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీకి ఆ పార్టీకి చెందిన నేతలకు షాకిచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాజీ మంత్రి,ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ” బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి వరకు అందరూ ఓనర్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు …

Read More »

బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం : ఎమ్మెల్సీ కవిత

నార్త్ ఇండియాలో మసీదుల్లో దేవుడి ఆలయాలు, విగ్రహాలున్నాయంటూ.. అసలు దేవాలయాలను కూల్చివేసి మసీదులను నిర్మించారంటూ పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా బీజేపీ నేతలు దేవుడి ప్రస్తావనను తీసుకొస్తున్నారు. రాజకీయాల్లో భగవంతుడి పేరును వాడుతున్నారు. దీనిపై జగిత్యాల వేదికగా ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ‘బీజేపీ జై శ్రీరామ్ అంటే.. మేము జై హనుమాన్ అంటాం’ అని తేల్చి చెప్పారు. …

Read More »

మహిళతో తన కాళ్ళు కడిగించుకున్న బీజేపీ ఎమ్మెల్యే

త్రిపురలో బీజేపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒక పేద మహిళతో  కాళ్లు కడిగించుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బధర్ ఘట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిమి మజుందర్‌ సూర్యపారా ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఊరంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓ పేద మహిళ ఆమె బకెట్ లో తెచ్చిన నీళ్లతో సదరు ఎమ్మెల్యే కాళ్లపై నీళ్లు పోసి సబ్బుతో …

Read More »

కాంగ్రెస్‌, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి

దేశానికి అన్నం పెట్టే రైతులకు సాయంపై జాతీయ పార్టీలైన  కాంగ్రెస్‌, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో అమలు చేయాల్సిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా  రైతుల పోరాట ఫలితంగానే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat