కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కి ఇది నాలుగవ బడ్జెట్. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. కేంద్ర బడ్జెట్–2022–23 ముఖ్యాంశాలు…. – రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలు – రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి వడ్డీ రహిత రుణ పరిమితిని రూ.15 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు …
Read More »కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తే ప్రధాని మంత్రి అవుతారా..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కి ఇది నాలుగవ బడ్జెట్. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. అయితే ఆర్థిక మంత్రుల స్థాయి నుంచి ప్రధాని, రాష్ట్రపతి పదవుల వరకూ ఎదిగిన ఏడుగురు ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొరార్జీ దేశాయ్ మాజీ ప్రధాని మొరార్జీ …
Read More »ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్స్
కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు ,ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం,ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధిక పన్నులను వసూళ్లు చేయడమే తాము సాధించిన గొప్ప విజయంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు . పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల బాధలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వానికి రాబడుల్లో పురోగతి, ప్రభుత్వ ఆర్థిక విధానం వల్ల …
Read More »అఖిలేష్ యాదవ్ పై పోటిగా కేంద్ర మంత్రి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ.. ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధినేత ,మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ పై పోటీగా ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తాజాగా కేంద్రమంత్రిని బరిలోకి దింపింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ సమాజ్ వాదీ పార్టీకి మంచి పట్టున్న కర్హాల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేశైపై కేంద్రమంత్రి …
Read More »దాదాపు ముప్పై ఏండ్ల తర్వాత తొలిసారిగా యూపీలో కాంగ్రెస్ ..?
యూపీలోని అన్ని నియోజకవర్గాల్లో (403) దాదాపు 30 ఏళ్ల తర్వాత పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ వాద్రా తెలిపారు. ఇది తమకు అతిపెద్ద ఘనతగా పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో తనపై ఎన్నికేసులు పెట్టినా ఎదుర్కొంటాను. జైలు శిక్ష అనుభవించడానికైనా సిద్ధమేనన్నారు. గత ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీచేసి 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈ సారి కాంగ్రెస్ ఒంటరిగానే బరిలో దిగుతోంది.
Read More »ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ నియోజకవర్గానికో స్పెషల్.. అది ఏమిటంటే..?
ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
Read More »యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.
Read More »కాంగ్రెస్ లోకి ఎంపీ డీఎస్
తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో P.C.C అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
Read More »బిపిన్ రావత్కు రాహుల్గాంధీ నివాళులు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
Read More »కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ పార్టీకి మేఘాలయ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. వీరిలో మాజీ సీఎం ముకుల్ సంగ్మా కూడా ఉండటం గమనార్హం. మేఘాలయ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో తాజాగా 12 మంది ఎమ్మెల్యేలు గుడ్బై చెప్పారు. దీంతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
Read More »