Home / TELANGANA (page 93)

TELANGANA

తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు అందుకున్న మహేశ్వర్ రెడ్డి.. ఇవాళ గురువారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. షోకాజ్ ఇచ్చే అధికారం TPCCకి లేదని, తాను పార్టీ మారడం లేదని ఆయన నిన్న స్పష్టం చేశారు. ఖర్గేతో తేల్చుకుంటానని ఢిల్లీ వెళ్లిన ఆయన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Read More »

కారేపల్లి ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

తెలంగాణలోని  ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి స‌మీపంలో ఊహించని రీతిలో సిలిండర్లు పేలి ఇద్దరు కార్యకర్తలు మరణించడం, పలువురికి తీవ్ర గాయాల‌వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఈ ఘ‌ట‌న గురించి తెలిసిన వెంటనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు, ప్రమాదం జరిగిన ప్రాంతంలో వున్న ఎంపీ నామా …

Read More »

కారేపల్లి బాధితులకు సరైన వైద్యం అందించాలి- మంత్రి హారీష్ రావు అధికారులకు ఆదేశం

MINISTER HARISH RAO sensational COMMENTS ON KANTI VELUGU SCHEME

తెలంగాణలోని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్ని ప్ర‌మాద‌ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందటం బాధాకరం అన్నారు. మృతులు, క్ష‌తగాత్రుల గురించి మంత్రి హ‌రీశ్‌రావు ఆరా తీశారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరం అయితే క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రికి తరలించి, …

Read More »

నేడు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్  ప్రభుత్వం రంజాన్‌ మాసం సందర్భంగా ఈరోజు బుధవారం హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్‌ విందును ఇవ్వనున్నది. దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా ఏటా రంజాన్‌ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, హోంమంత్రి మహమూద్‌ అలీ మంగళవారం పరిశీలించారు. ఈ …

Read More »

జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణలో గ్రామ పంచాయతీల్లో పని చేస్తోన్న  జూనియర్ పంచాయతీ సెక్రటరీలను క్రమబద్ధీకరణ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్  ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారిగా వివరాలను ఇవ్వాలని డిపివోలను ఆదేశించింది. కాగా 2019లో ‘రాష్ట్ర వ్యాప్తంగా 9352 మంది జేపీఎస్ నియామకాన్ని చేపట్టిన ప్రభుత్వం వారిని ఇప్పటివరకు రెగ్యులర్ చేయలేదు. దీంతో ఈ నెల 28లోగా రెగ్యులరైజ్ చేయకపోతే సమ్మెలోకి …

Read More »

రెండో విడతలో 3.38 లక్షల గొర్రెల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీలో భాగంగా రెండో విడతలో 3.38 లక్షల గొర్రెల పంపిణీకి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు గొర్రెలు, మేకలు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ బాలరాజు వెల్లడించారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ట్రాన్స్ పోర్ట్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.6,100 కోట్లు కేటాయించిందని తెలిపారు. మొత్తంగా 73.50 లక్షల గొర్రెలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు.

Read More »

మాజీ ఎంపీ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నుంచి ఇప్పటికైనా తనను సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇన్నాళ్లకు దొరల గడీ నుంచి విముక్తి లభించిందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా పార్టీతో విభేదిస్తున్న పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలతో రాజకీయ వేడిని పెంచుతున్న విషయం తెలిసిందే.

Read More »

వైరల్ అవుతోన్న ఎర్రోళ్ల శ్రీను చెప్పిన పారాచ్యూట్ కథ

ఆత్మీయ సమ్మేళనంలో పారాచ్యూట్‌ కథ జనం మనసును కదిలించింది. అధికారం కోసం ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీల ఎట్ల ఆరాటపడుతున్నాయో కండ్లకుకట్టినట్టుగా ఆవిష్కరించింది. బీఆర్‌ఎస్‌ పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్‌ కాస్త ఆలస్యంగా వచ్చినప్పటికీ తన ప్రసంగంతో మెప్పించారు. రాష్ట్రంలో అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ల నైజాన్ని ‘ఒక విమానం… నాలుగు పారాచ్యూట్‌’ కథతో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు.ఆ కథ కమామిషు ఏమిటంటే …

Read More »

కష్టం రాష్ర్టానిది.. కాసులు కేంద్రానికి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌ చుట్టూ వివిధ జిల్లాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రీజనల్‌ రింగురోడ్డు (త్రిఫుల్‌ ఆర్‌)పై కేంద్ర ప్రభుత్వం దొంగ నాటకం అడుతున్నది. భూసేకరణ పేరుతో మెలికపెట్టి ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేస్తున్నది. రోడ్డు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు టోల్‌ట్యాక్స్‌ రూపంలో తాము రాబట్టుకొని, భూసేకరణ ఖర్చులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై మోపాలని ఎత్తుగడ వేసింది. ఉల్టాచోర్‌ కోత్వాల్‌ కో డాంటే అనే చందంగా తప్పంతా …

Read More »

మాజీ మంత్రి జూపల్లి,మాజీ ఎంపీ పొంగులేటిపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు

తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌  పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెండ్‌ చేసింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌  ఆదేశాలతో బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ప్రకటించింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat