ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులు పని చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రధాని నరేంద్ర మోదీ పాటించకుంటే ఎలా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు.. ఏం చేయదలుచుకున్నారని కేసీఆర్ అడిగారు. ప్రగతి భవన్లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.కర్ణాటకలో …
Read More »టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఖరారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జూన్ 26 …
Read More »రేవంత్రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్మెయిలర్
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ..మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్రెడ్డి ఒక బ్రోకర్, బ్లాక్మెయిలర్ అని విరుచుకుపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడకల ఆస్పత్రిని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి నిర్మించుకోవడం చాలా సంతోషకరంగా …
Read More »వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు, డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారు, కార్పొరేటర్ సుజాత గారితో కలిసి ప్రారంభించారు. …
Read More »ధరణి లేకుంటే దారుణమే
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో కలిపేస్తాం’ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్య ఇది. మొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కూడా ఇట్లాగే మాట్లాడారు. కాంగ్రెస్కు ఎందుకు ధరణిపై కక్ష?.ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో పేద రైతుల భూ రికార్డులు పట్వారీలు, వీఆర్ఏలు, వీఆర్వోలు, గిర్దావర్లు, తహసిల్దార్ల ఇండ్లల్ల ఉంటుండె. ఇప్పుడవి రైతు కంటిచూపు పరిధిలో ఉన్నయి. కంప్యూటర్ మౌస్ క్లిక్ చేస్తే చాలు, ఫోన్ మీద …
Read More »తెలంగాణకు,దేశానికి శ్రీరామరక్ష గులాబీ జెండా
పసివాళ్ళు ఏం చేసినా ఆనందంగా అనిపిస్తుంది. పెద్దవాళ్లు ఏం చేసినా అభిమానంగా ఉంటుంది. ఆ ఇద్దరూ కలిసి ఏదైనా చేస్తే అది అత్యంత సంతోషాన్నిస్తుంది. ఇలాంటి ఘటనే ఒకటి పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగరలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో చోటు చేసుకుంది. బిఆర్ ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎదురుగా …
Read More »వాసవి క్లబ్ సేవలు అభినందనీయం.
సామాజిక సేవలో వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిమెంట్ బెంచ్ ల పంపిణీలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలన్నారు. స్వచ్ఛంద సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇస్తుందన్నారు. వాసవి క్లబ్ …
Read More »ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 69వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.2.72 కోట్లతో చేపట్టిన వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు చేశారు. మొదటగా 15వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ లో రూ.17 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, చిల్డ్రన్ పార్క్ ను ఎమ్మెల్యే కేపి …
Read More »హైదరాబాద్కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్
ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లు హైదరాబాద్కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాకతీయ హోటల్కు వెళ్లారు. అక్కడ్నుంచి ప్రగతి భవన్కు చేరుకోనున్నారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో కలిసి అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ లంచ్ చేయనున్నారు. కేజ్రీవాల్ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు.
Read More »రోడ్డు విస్తరణ బాధితులకు రూ.53.40 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇండ్లు కోల్పోయిన ఏడుగురు బాధిత కుటుంబాలకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారాన్ని మంజూరు చేయించి చింతల్ లోని తన కార్యాలయం వద్ద రూ.53,40,316/- విలువ చేసే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ఇండ్లు కోల్పోయిన 48 బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయడం జరిగిందన్నారు. పెండింగ్ లో …
Read More »