తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ( టీబీజీకేఎస్)వర్కింగ్ ప్రెసిడెంట్ గా కెంగర్ల మల్లయ్యకు ఎమ్మెల్సీ కవిత నియామక పత్రం అందజేశారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలోతు కవిత, వెంకటేష్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణ రెడ్డి, దుర్గం చెన్నయ్య, దివాకర్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి …
Read More »వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు- మంత్రి కేటీఆర్
వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్లో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్తో పాటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. మల్లాపూర్లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడారు. …
Read More »కాంగ్రెస్లో భట్టిది నడుస్తలేదు.. అక్కడ గట్టి అక్రమార్కులున్నారు: కేటీఆర్
హైదరాబాద్: శాసనసభలో మంత్రి కేటీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తన ప్రసంగంలో కేటీఆర్ ప్రస్తావించారు. దీనిపై భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. ఏమైందంటే.. బడ్జెట్పై చర్చలో కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అంశంపై రేవంత్రెడ్డి స్పందించిన తీరుపై వ్యాఖ్యలు చేశారు. సభలో పోడియం వద్దకు వచ్చి …
Read More »మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నాం- మంత్రి కేటీఆర్
మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2014, 2015 సంవత్సరాల్లో రెండు మూడు సందర్భాల్లో …
Read More »దేశాన్ని బాగుచేయడం కేసీఆర్ వల్లే అవుతుంది: శ్రీనివాస్గౌడ్
హైదరాబాద్: బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన నేపథ్యంలో గన్పార్క్ వద్ద టీఆర్ ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా బీజేపీ తీసుకురాలేదని ఆరోపించారు. మతకలహాలు సృష్టించి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏడేళ్లలో …
Read More »నిరుద్యోగులకు ఇది గోల్డెన్ ఆపర్చ్యునిటీ: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో 80వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారని.. దీన్నినిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఏడేన్నరేండ్లుగా యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసిందని.. అలాంటి వారు ఆనందపడే రోజు ఇది అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటన వారికి గోల్డెన్ ఆపర్చ్యునిటీ అన్నారు. నిజాం కాలేజ్లో నిర్వహించిన గ్యాడ్యుయేషన్ డే కార్యక్రమానికి కేటీఆర్ …
Read More »తెలంగాణలో కొలువుల జాతర -80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రభుత్వం.. నేడు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసింది. 80,039 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని సీఎం ప్రకటించారు. తెలంగాణ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో 2,020 బోధన పోస్టులను, 2,774 బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ …
Read More »17 లక్షల కుటుంబాలకు దళితబంధు
తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 17 లక్షల కుటుంబాలకు దళితబంధు పథకం అందుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ మైదానంలో 393 మంది దళితబంధు లబ్ధిదారులకు 202 వాహనాలను మంత్రి గంగుల కమలాకర్తో కలసి పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ప్రతీ దళితుడు లక్షాధికారి కావాలన్న కేసీఆర్ సంకల్పానికి ఈ పథకం నిదర్శనమన్నారు.
Read More »తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ముహుర్తం ఖరారు
తెలంగాణ ఎంసెట్ – 2022 నోటిఫికేషన్ ఈ నెల 14న వెలువడే అవకాశం ఉంది. ఉన్నత విద్యామండలి సమీక్షా సమావేశంలో నోటిఫికేషన్ వెలువరించాలని నిర్ణయించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. అధికారులు తమకు సానుకూల తేదీలను సాంకేతిక తోడ్పాటును అందించే టీసీఎస్ సంస్థకు అందించారు. ఈ సంస్థ ఆయా తేదీల్లో ఎంసెట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, నిర్ధిష్టమైన తేదీలను విద్యామండలి ముందుకు తేనుంది.
Read More »శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధం
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వీరి ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. గురువారం నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఎన్నిక నిర్వహిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి శాసన మండలిలో పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో.. రెండు పదవులు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.
Read More »