తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు శుభాకాంక్షలు, తెలిపి అభినందించారు. శాసన మండలిలో మంగళవారం ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తనకు 30 ఏండ్లుగా తెలుసని, వారు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారని, మూడు సార్లు ఎంపీగా, రెండుసార్లు …
Read More »60 ఏళ్లలో 3.. ఈ ఆరున్నరేళ్లలో 33 మెడికల్ కాలేజీలు: మంత్రి హరీష్రావు
హైదరాబాద్: ఇతర దేశాలకు వెళ్లి మెడిసిన్ చదివే అవసరం లేకుండా రాష్ట్రంలోనే మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచామని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్రావు అన్నారు. శాసనసభ క్వశ్చన్ అవర్లో హరీష్రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఉమ్మడి పరిపాలనలో ఉన్నప్పుడు ఏపీలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఆ అవకాశమే ఉండేది కాదని చెప్పారు. ఇదే సభలో అనేక …
Read More »రేవంత్కు మళ్లీ మల్కాజ్గిరిలో గెలిచే సత్తా ఉందా?: గువ్వల బాలరాజు
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీతో పాలమూరుకు ఏం మేలు జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. కొల్లాపూర్ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన కామెంట్లపై ఆయన మండిపడ్డారు. రేవంత్రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడిలా మాట్లాడటం లేదని చెప్పారు. టీఆర్ఎస్ఎల్పీ ఆఫీస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడారు. పీసీసీ అధ్యక్ష పదవిని వ్యాపారాల కోసం రేవంత్ వాడుకుంటున్నారని ఆరోపించారు. భయం వల్లే కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం లేదన్నారు. …
Read More »అత్యున్నత పదవుల్లో రైతుబిడ్డలు ఉండటం ప్రజల అదృష్టం: కేటీఆర్
హైదరాబాద్: శాసన మండలి ఛైర్మన్గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి ఛైర్మన్ పదవికి గుత్తా ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం ఛైర్మన్ హసన్ జాఫ్రి ప్రకటించారు. గుత్తా మండలి ఛైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. ఎన్నికైనట్లు ప్రకటించిన అనంతరం గుత్తా సుఖేందర్రెడ్డిని మంత్రులు కేటీఆర్, ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్ తదితరులు ఛైర్మన్ స్థానం వద్దకు తీసుకెళ్లారు. …
Read More »తెలంగాణలో ‘కారు’స్పీడ్లో ఉంది.. యూపీ ఫలితాలు ఇక్కడ రావు: అసదుద్దీన్
హైదరాబాద్: బీజేపీ హైకమాండ్ తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఉపయోగం ఉండదని మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. యూపీ ఎన్నికల ఫలితాలు తనను సర్ప్రైజ్ చేయలేదని చెప్పారు. హైదరాబాద్లో మీడియాతో అసద్ మాట్లాడారు. యూపీలో ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్యాదవ్ మరింత ముందుగానే రెడీ అవ్వాల్సిందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ బలంగా ఉందని.. ‘కారు’ స్పీడ్లో ఉందని …
Read More »పార్టీ మార్పుపై మాజీ మంత్రి తుమ్మల క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి చెందిన నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు రెబల్గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు వచ్చే …
Read More »సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రిలు కావాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించారని గవర్నర్ తమిళిసై తెలిపారు.
Read More »తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో 9,057 ఆర్టీసీ బస్సులు -మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్రంలో వ్యాప్తంగా ప్రయాణికుల అవసరాల మేరకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా జీహెచ్ఎంసీ, ఇతర జిల్లాల్లో ఆర్టీసీ బస్సుల సౌకర్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పువ్వాడ అజయ్ సమాధానం ఇచ్చారు.2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బస్సులు తిరిగితే.. 2022లో 9,057 బస్సులు తిరుగుతున్నాయని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నాడు 3,554 బస్సులు అందుబాటులో …
Read More »హైదరాబాద్లో రూ. 985 కోట్లతో ఎస్ఎన్డీపీ పనులు- మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో వరద నీరు, మురుగు నీటి వ్యవస్థ మెరుగుదల కొరకు ప్రభుత్వం వ్యూహాత్మక నాలాల అభివృద్ధి(ఎస్ఎన్డీపీ) కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఎస్ఎన్డీపీ కింద రూ. 985 కోట్ల 45 లక్షల వ్యయంతో మొత్తం 60 పనులు చేపట్టామని తెలిపారు. ఈ పనులన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఎస్ఎన్డీపీ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. …
Read More »మంత్రి జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సవాల్ ..?
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డికి మునుగోడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా ప్రాంగణంలో మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన పర్వాలేదు. నన్ను సూర్యాపేటకు రమ్మన్న పర్వాలేదు. నాపై పోటికి మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సిద్దమా అని సవాల్ విసిరారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More »