చారిత్రక నేపథ్యం ఉన్న ఓరుగల్లుకు భద్రకాళి బండ్ మరో మనిహారంగా మారుతోందని ఆనందం వ్యక్తం చేశారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 2కోట్ల 10 లక్షలతో నిర్మించిన 570 మీటర్ల పొడవైన భద్రకాళి మినీబండ్ ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి …
Read More »సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ వ్యాప్తంగా తాను నిర్వహించే పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుంటానని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభించారు బండి సంజయ్.. సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదని, తాము అధికారంలోకి వచ్చాక పాత కేసులు తిరగదోడి ఆయన సంగతి చూస్తామని బండి …
Read More »చేతికి ఎముక లేదడానికి ట్రేడ్మార్క్ కేసీఆర్: సీజేఐ ఎన్వీ రమణ
చేతికి ఎముక లేదడానికి ట్రేడ్మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ 4320కిపైగా ఉద్యోగాలు సృష్టించారన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్లో జరిగిన న్యాయాధికారుల సదస్సుకు సీజేఐ ఎన్వీ రమణ, హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ …
Read More »సీపీఐ నేత నారాయణ ఇంట విషాదం
సీపీఐ నేత నారాయణ ఇంట పెద్ద విషాదం చోటు చేసుకుంది. నారాయణ సతీమణి గారైన శ్రీమతి వసుమతి అనారోగ్యంతో ఈరోజు ఏపీలోని తిరుపతిలో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు వసుమతి. రేపు నగరి మండలం ఐనంబాకంలో అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆమె మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వారు ప్రకటించారు.
Read More »మిగతా వర్గాలకూ దళితబంధు తరహా పథకం: కేటీఆర్
దళితబంధు నిధులతో ముగ్గురు, నలుగురు కలిసి ఉమ్మడి వ్యాపారం చేసుకుంటే మరింత అభివృద్ధి సాధించవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన దళితబంధు లబ్ధిదారులకు నిధుల మంజూరు లేఖల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితబంధు నిధులతో ట్రాక్టర్లు, హార్వెస్టర్లే కొంటామంటే వాటి ప్రారంభోత్సవానికి తాను రానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ నిధులతో రాష్ట్రంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చని చెప్పారు. రూపాయి పెట్టుబడి పెట్టి రూపాయిన్నర రాబడి గురించి …
Read More »అంబేద్కర్కు నివాళులర్పించిన సీఎం కేసీఆర్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్లో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి సీఎం ఈ సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతికి అంబేద్కర్ అందించిన సేవలను ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, సీఎం కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
Read More »అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ పాలన
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లే దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్పీకర్ ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు …
Read More »తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ విడతల వారీగా అనుమతులు ఇస్తోంది. తొలి విడతలో 30,453 పోస్టులకు పర్మిషన్ ఇచ్చిన ఆర్థికశాఖ.. ఈరోజు మరో 3,334 పోస్టుల భర్తీకి అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోస్టులు అగ్నిమాపక, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని ఖాళీలకు సంబంధించినవి. మిగతా శాఖల్లోని …
Read More »గవర్నమెంట్ హాస్పిటల్స్లో బూస్టర్కి పర్మిషన్ ఇవ్వండి: హరీశ్రావు
రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్పిటళ్లలోనూ కొవిడ్బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్లోనే బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని మన్సుఖ్ మాండవీయను హరీశ్రావు కోరారు. …
Read More »అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చింది : మంత్రి కేటీఆర్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పీవీ మార్గ్లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబోతోందన్నారు. భారతదేశం …
Read More »