తెలంగాణ కలను సాకారం చేసి.. బంగారు తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఏఫ్రిల్ ఇరవై ఏడున హైటెక్స్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ నవీన్ రావులతో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవం, అస్థిత్వానికి ప్రతీకగా …
Read More »ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదరులకు మంత్రి హరీశ్ రావు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు ప్రభువు పునరుత్థానానికి సంకేతంగా ప్రపంచవ్యాప్తంగా ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నారని చెప్పారు. చెడుపై మంచి గెలిచిన రోజని, ప్రేమ, దయ, కరుణాగుణాన్ని సిలువపై తన జీవితం ద్వారా యేసు క్రీస్తు ప్రపంచానికి చాటిచెప్పిన రోజన్నారు. ఒకరిపట్ల ఒకరు ప్రేమతో, దయాగుణంతో వ్యవహరించాలని ఈస్టర్ సందర్భంగా కోరుకున్నారు.
Read More »మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మంలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే రేపటి మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈ-కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. మరో ఒకట్రెండు రోజుల్లో ఖమ్మం పర్యటన తదుపరి …
Read More »ఈనెల 27న టీఆర్ఎస్ ప్లీనరీ.. ఎక్కడంటే..!
కొవిడ్ పరిస్థితులతో గత రెండేళ్లుగా నిర్వహించలేకపోయిన టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈసారి హైదరాబాద్లో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఏప్రిల్ 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆరోజు ఉదయం 11.05 గంటలకు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. అదేరోజు ప్లీనరీ సమావేశాన్ని కూడా నిర్వహించనున్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి మంత్రులు, …
Read More »అనవసర కొర్రీలతో ఇబ్బందులు పెట్టొద్దు: మంత్రి గంగుల
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులు ఎప్పటికప్పుడు అలెర్ట్గా ఉండాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై పౌరసరఫరాల శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగి ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియ మొదలు పెట్టిందని చెప్పారు. పక్క రాష్ట్రాల నుంచి ధాన్యం వస్తే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి అన్నారు. అవసరమైతే కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. అంతకుముందు సివిల్ …
Read More »హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్
ప్రముఖ సినీనటుడు ప్రభాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ జంక్షన్ వద్ద బ్లాక్ ఫిల్మ్తో వెళ్తున్న కారును పోలీసులు ఆపి పరిశీలించగా అది ప్రభాస్దిగా తేలింది. నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ.1,450 చలానా విధించారు. అయితే ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. ఇదే కారణంతో ఇటీవల ఎన్టీఆర్, నాగచైతన్య, …
Read More »మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మరోసారి ఢిల్లీ పయనమవుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఇటీవలే కేంద్రానికి వ్యతిరేకంగా హస్తినలో ధర్నా చేసిన ఆయన.. బీజేపీపై పోరులో భాగంగా రెండు రోజుల్లో మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈసారి వారం రోజులు అక్కడే ఉండి కొత్త వ్యవసాయ చట్టాలపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన యూపీ వెళ్లి లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం చేసే అవకాశం ఉంది.
Read More »హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ఇంట్లోంచి బయటకు రావొద్దు!
భాగ్యనగర వాసులకు ఊరట కలిగించే వార్త ఇది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఇది కాస్త ఉపశమనం. రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీకి నార్త్, వెస్ట్రన్ ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయని.. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జీహెచ్ఎంసీ …
Read More »రేపు హైదరాబాద్లో మద్యం దుకాణాలు బంద్!
హనుమాన్ జయంతి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హనుమాన్ శోభాయాత్ర జరనున్నందున సిటీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయని తెలిపారు. 16వ తేదీ (రేపు) ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ (ఎల్లుండి) ఉదయం 6 గంటల వరకు వైన్షాప్లు బంద్ అవుతాయని తెలిపారు. మరోవైపు హనుమాన్ శోభాయాత్రకి 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌలిగూడలోని రామాలయం నుంచి తాడ్బండ్లోని హనుమాన్ …
Read More »మీ పాదయాత్రకు ఆ పేరు పెట్టుకోండి: బండిపై కేటీఆర్ ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు పాలమూరులో అడుగుపెట్టే అర్హత లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడీకి జై కొడతారా? పాలమూరు రైతులకు ద్రోహం చేస్తూ పాదయాత్రలా? అని మండిపడ్డారు. బండి సంజయ్ చేస్తోందని ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. ప్రజా వంచన యాత్ర అని తీవ్రస్థాయిలో కేటీఆర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. …
Read More »