Home / TELANGANA (page 195)

TELANGANA

సాయి చరణ్ కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్ష

 అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన  నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్‌ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల పెట్టుబడులకు ఫ్రెష్ టు హోమ్ సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు  ఆన్‌లైన్‌లో మాంసం విక్రయాలు జరిపే ప్రముఖ  ఫ్రెష్‌టుహోమ్‌ (ఎఫ్‌టీహెచ్‌).. ప్రకటించింది. ఈ క్రమంలో  రాబోయే ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా చేయబోయే వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.తాజా మాంసం, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఈ-కామర్స్‌ వేదికగా ఎఫ్‌టీహెచ్‌ పేరుగాంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 98 శాతానికిపైగా మంది మాంసాహార ప్రియులే. నెలకు …

Read More »

రేపే TRS ఎంపీలు పదవీ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ తరపున రాజ్య‌సభ సభ్యు‌లుగా ఎన్ని‌కైన నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి ఈ నెల 24న తమ పదవీ బాధ్య‌తలు స్వీక‌రిం‌చ‌ను‌న్నారు. ఉప‌రా‌ష్ట్ర‌పతి వెంక‌య్య‌నా‌యుడు తన కార్యా‌ల‌యంలో నూతన ఎంపీ‌ల‌ చేత రేపు శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రమాణ స్వీకారం చేయించ‌నున్నారు.

Read More »

మ‌హిళ‌ల జోలికోస్తే ఎంతిటి వారినైనా ఉపేక్షించేది లేదు-అద‌న‌పు డీజీపీ స్వాతి ల‌క్రా

తెలంగాణ రాష్ట్రంలోని మ‌హిళ‌ల జోలికోస్తే ఎంతిటి వారినైనా ఉపేక్షించేది లేద‌ని, క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అద‌న‌పు డీజీపీ, ఉమెన్ సెఫ్టీ విభాగం అధికారి స్వాతి ల‌క్రా తేల్చిచెప్పారు. గ‌ద్వాల జిల్లా కేంద్రంలో భ‌రోసా కేంద్రం, స్త్రీ బాల‌ల స‌హాయ కేంద్రాన్ని స్వాతి ల‌క్రా ఈ రోజు గురువారం ఉద‌యం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో గ‌ద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ‌మోహ‌న్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్ర‌హం, గ‌ద్వాల జిల్లా జ‌డ్పీ చైర్మ‌న్ …

Read More »

త్వరలో రైతుల అకౌంట్లలో రైతుబంధు సాయం

త్వరలో రైతుబంధు కింద పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈనెల 28 నుంచి అకౌంట్లలో వేయాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ సోమేష్‌ను కేసీఆర్‌ ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించి క్రమంగా ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారికి రైతుబంధు జమ చేస్తారు. రైతుబంధు కోసం వానాకాలం సీజన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600 కోట్ల సాయం …

Read More »

రాష్ట్రపతి ఎన్నిక.. కేసీఆర్‌ మద్దతు ఆయనకేనా!

రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ విషయంలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయాలపై ఆసక్తి ఉన్న అందరూ వెయిట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్‌ సిన్హాకు కేసీఆర్‌ మద్దతిస్తారని శరద్‌ పవార్‌ చెప్పారు. ముంబయిలో …

Read More »

దేశంలో ఏ వర్గమూ సంతోషంగా లేదు: కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన ఈ 8 ఏళ్లలో హైదరాబాద్‌లో 30 ఫ్లైఓవర్లు నిర్మించిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. మరో 17 ఫ్లైఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ నగర అభివృద్ధికి సూచిక ప్రజా రవాణా, రహదారులేనని చెప్పారు. కూకట్‌పల్లిలోని కైతలాపూర్‌ వద్ద రూ.84 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. …

Read More »

కేసీఆర్‌ సీఎం అయ్యాకే రైతులకు గౌరవం: హరీష్‌రావు

కేసీఆర్‌ సీఎం అయ్యాక రైతులకు గౌరవం దక్కడంతో పాటు భూముల ధరలు పెరిగాయని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అన్నారు. అభివృద్ధి కేవలం కేసీఆర్‌ వల్లే సాధ్యమైందని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత కూడా ఆయనదేనన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్‌లో రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని హరీష్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్టుతో 14 గ్రామాలకు తాగునీరు అందుతుందని చెప్పారు. రూ.37కోట్ల …

Read More »

తెలంగాణలో మండలానికి రెండు మాడల్‌ స్కూళ్లు

తెలంగాణలో సర్కారు స్కూళ్లను సమగ్రంగా మార్చే మన ఊరు – మనబడి కార్యక్రమ పనులు ఊపందుకొన్నాయి. మొదటి విడతలో చేపట్టిన బడుల్లో పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కో మండలాన్ని ఒక యూనిట్‌గా చేసుకొని పనులను ఇంజినీరింగ్‌ ఏజెన్సీలకు అప్పగించారు. మండలానికి రెండు చొప్పున మాడల్‌ స్కూళ్లుగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని 594 మండలాల్లో 1,188 స్కూళ్లను జూన్‌ 30 నాటికి సిద్ధం చేయాలని గడువుగా విధించారు. మిగతా 7,935 బడుల్లోనూ పనులు …

Read More »

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. దుబాయి నుంచి ఓ ప్ర‌యాణికుడి నుంచి 1022 గ్రాముల బంగారాన్ని క‌స్ట‌మ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 53.77 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. క్నీ క్యాప్స్‌లో బంగారాన్ని దాచి త‌ర‌లిస్తున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. స‌ద‌రు ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు.. శంషాబాద్ పోలీసుల‌కు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat