కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ జంక్షన్ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, ట్రాఫిక్, టౌన్ ప్లానింగ్, టీఎస్ఎస్ పిడిసీఎల్, జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు తీవ్ర ట్రాఫిక్ సమస్య నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులలో భాగంగా అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలు బదిలీ చేసి, రోడ్డు నిర్మాణ పనులు వేగంగా చేపట్టి పూర్తి …
Read More »తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఈ రోజు మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా విడుదలయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఫలితాలను విడుదల చేశారు. . ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్తో కలిపి మొత్తం 9,07,393 మంది …
Read More »తెలంగాణలో ఆగస్టులో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో మే 6వ తేదీన మొదలై మే 24 వరకు జరిగిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు మంగళవారం హైదరాబాద్ లోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కరోనా వల్ల గడిచిచిన రెండేళ్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. విద్యార్థులకు నష్టం జరగకుండా ఆన్లైన్లో బోధన చేశాం. గతేడాది 70 …
Read More »BJPకి TRS షాక్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో మరో 4 రోజుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ప్రధాని నరేందర్ మోదీ బహిరంగ సభ ఉన్న విషయం తెలిసిందే. కాగా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ప్రచారం చేసేందుకు బీజేపీకి తావు లేకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ చేసింది. వారం రోజుల వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 2300 మెట్రో పిల్లర్లతో పాటు అన్ని హోర్డింగ్లపై గత ఎనిమిదేండ్లుగా …
Read More »సీసీ రోడ్డు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే Kpకు వినతి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ ఓపెన్ లాండ్ కు అనుకోని ఉన్న దేవమ్మ బస్తీ మహంకాళి టెంపుల్ నుండి గ్రేవియార్డు వరకు సీసీ రోడ్డు, భూగర్భడ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్ గారి ఆధ్వర్యంలో బస్తీ వాసులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. …
Read More »గజ్వేల్కు నేటి నుంచి గూడ్స్ రైలు రాకపోకలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్కు నేటి నుంచి గూడ్స్ రైలు రాకపోకలు ప్రారంభం కానున్నాయి. గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎరువుల రేక్ పాయింట్కు అనుసంధానంగా ఈ రైలు సరకు రవాణా చేస్తుంది. ఈ సేవలను రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి 12 బోగీలతో వచ్చే ఈ తొలి గూడ్స్ రైలులో 11 మెట్రిక్ టన్నుల ఎరువులు రానున్నాయని …
Read More »కొల్లాపూర్లో సై అంటే సై.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్
కొల్లపూర్కి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చకు వెళ్తుండగా పోలీసులు హర్షవర్ధన్రెడ్డిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో కొల్లాపూర్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొల్లపూర్నియోజకవర్గంలో టీఆర్ఎస్పార్టీలో రెండు వర్గాలున్నాయి. ఒకటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుది కాగా.. మరొకటి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డిది. గత కొంతకాలంగా ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కొల్లాపూర్ అభివృద్ధిపై …
Read More »టీచర్లంతా ఆస్తులు వెల్లడించాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్మాస్టర్ మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ …
Read More »BJP పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారు
డబుల్ ఇంజిన్లతో కేంద్రం ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణా రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని అటువంటి పసిగుడ్డును గొంతు నులిమెందుకు మోడీ సర్కార్ కుట్రలు పన్నుతోందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ను కాదని కమలనాధులకు అవకాశం ఇస్తే బిజెపి పాలకులు దేశాన్ని ప్రమాదపుటంచున నిలబెట్టారని ఆయన విమర్శించారు. తెలంగాణా రాష్ట్ర రెడ్కో చైర్మన్ గా నియమితులైన …
Read More »తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన TRS Mps
తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.
Read More »