అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కృషి చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాలు ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పలు ఆహ్వాన పత్రికలు మరియు సమస్యలపై ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు అందజేయగా.. సమస్యలపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని …
Read More »భద్రాచలం కు హెలికాప్టర్ పంపండి -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి 68 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎస్, రెస్క్యూ బృందాలు సహా హెలికాప్టర్లను భద్రాచలానికి తరలించాలని సీఎస్ …
Read More »గోదావరి నదిలో చిక్కుకున్న మేకల కాపర్లు.. హెలికాప్టర్తో ఒడ్డుకు..
భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నూరు మండలం సోమన్పల్లి వద్ద నదిలో చిక్కుకున్న ఇద్దరు మేకల కాపరులను హెలికాప్టర్ ద్వారా సుక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మేకల కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తడంతో నదిలో చిక్కుకున్నారు. అక్కడ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. వరద పెరిగిపోవడంతో వారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని …
Read More »మరో ఐదు గంటల్లో.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. పలు జిల్లాల్లో నదులు, చెరువుల్లోకి వరదనీరు చేరడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రానున్న ఐదు గంటల్లో ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ …
Read More »భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. రాకపోకలు బంద్
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి నీటిమట్టం 60.30 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని లోతట్టు కాలనీలకు వరదనీరు భారీగా చేరడంతో అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.గోదావరికి వరద నీటి ప్రభావం అధికంగా ఉండడంతో భద్రాచలం నుంచి చర్ల, కూనవరం వెళ్లే మార్గాల్లో రావాణా నిలిచిపోయింది. నేటి సాయంత్రం నుంచి గోదావరి బ్రిడ్జ్పై రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. దీంతో హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోనున్నాయి. గోదావరి …
Read More »నెలరోజులకు బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉంచండి: కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో గోదావరి ఉద్ధృతి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వస్తున్న వరదను అంచనా వేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మరో నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధం …
Read More »హైదరాబాద్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ జరిగింది. మొత్తం 69 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వ్యవహారం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. నారాయణగూడ ఇన్స్పెక్టర్గా రాపోలు శ్రీనివాస్రెడ్డి, సైఫాబాద్కు కె.సత్తయ్య, శాలిబండకు జి.కిషన్, బేగంబజార్కు ఎన్.శంకర్, ఆసిఫ్నగర్కు శ్రీనివాస్, రాంగోపాల్పేటకు జి.లింగేశ్వరరావు, మొగల్పురాకు శివకుమార్ను నియమించారు. ఈ మేరకు …
Read More »విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండబోదు : మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని ఆయన కొనియాడారు. ఇవే వర్షాలు గతంలో పడ్డప్పుడు విద్యుత్ శాఖా అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో కుండపోతగా …
Read More »తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. నేటితో సెలవులు ముగుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురు, శుక్ర, …
Read More »