తెలంగాణలో గత మూడురోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీయం… ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు …
Read More »ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా రాజధాని నగరం హైదరాబాద్
తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు రాజధాని నగరం హైదరాబాద్ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక & వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ రోజు శనివారం ఉదయం నగరంలోని గచ్చిబౌలిలోని ఆస్పైర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సేవలను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతరలో భాగంగా మరో 2,440 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. విద్యాశాఖతో పాటు, స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లలో పోస్టుల భర్తీకి అనుమతిఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు శుక్రవారం 5 వేర్వేరు జీవోలను జారీ చేశారు. ఇంటర్ విద్యలో 1,523 పోస్టులకు జీవో-117, కళాశాల విద్యలో …
Read More »KTR Birthday-మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖమంత్రి,అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రేపు పుట్టిన రోజు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారకరామారావు తెలిపారు. వర్షాల వలన, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు …
Read More »భారీ వర్షాలు.. అలెర్ట్గా ఉండండి: కేసీఆర్ ఆదేశం
మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగమంతా అలెర్ట్గా ఉండాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పెరిగే అవకాశముందని.. నీరుపారుదల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని రివ్యూ చేయాలని ఆదేశించారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలపై జీహెచ్ఎంసీ సిబ్బంది …
Read More »హైదరాబాద్లో భారీ వర్షం.. మరో రెండు రోజులూ ఇంతే!
హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి చిరుజల్లులు పడుతూనే ఉండగా.. సాయంత్రం నుంచి భారీ వర్షం పడింది. ఇటు పటాన్ చెరు నుంచి అటు అబ్దుల్లాపూర్మెట్ వరకు వర్షం కురుస్తూనే ఉంది. అమీర్పేట్, నాంపల్లి, కోఠి, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, జీడిమెట్ల, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో …
Read More »సంజయ్ను ఈడీ చీఫ్గా నియమించినందుకు ధన్యవాదాలు: కేటీఆర్ సెటైర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఈడీ విచారణ సీఎం కేసీఆర్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ తప్పదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఉద్దేశించి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను ఈడీ చీఫ్గా నియమించినందుకు ధన్యవాదాలు. దేశాన్నినడిపిస్తున్న డబుల్ ఇంజిన్ ‘మోడీ-ఈడీ’ అని దీంతో అర్థమవుతోంది …
Read More »డెంగీ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉంది.. జాగ్రత్తలు ముఖ్యం
ఇటీవల భారీ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో దోమలు పెరిగి డెంగీ జ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. వచ్చే నెల రోజులు చాలా కీలకమని, ముఖ్యంగా వరద ప్రభావిత, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లా వైద్యాధికారులతో మంత్రి వీడియో …
Read More »బోనాలు వేడుకలు సజావుగా జరపాలి
జంటనగరాల్లో బోనాలు వేడుకలు సజావుగా జరిపేల ఏర్పాట్లు జరుపుతున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ దేవాలయాల నిర్వాహకులకు చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం గురువారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. దాదాపు 185 దేవాలయాలకు రూ. కోటి మేరకు నిధుల చెక్కులను శ్రీ పద్మారావు గౌడ్ అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ …
Read More »పార్లమెంట్ లో ఆగని టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు..
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో బీజేపీ సర్కారు జీఎస్టీ పేరుమీద పెంచిన ధరలు, జీఎస్టీ భారాలపై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో చేస్తున్న ఆందోళనలు, నిరసనలు శుక్రవారం కూడా కొనసాగాయి. పార్లమెంట్ వెలుపల గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ప్ల కార్డులతో నిరసనకు దిగారు. అధిక ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇతర విపక్ష పార్టీల ఎంపీలు కూడా తమ …
Read More »