తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఈ క్రమంలో నిన్న శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ప్రగతి భవన్ లో సమావేశమైన సంగతి విదితమే.. ఈ సందర్భంగా 2022 సెప్టెంబర్ 17 ను ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ప్రారంభ దినం’ గా, మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది.రాచరిక వ్యవస్థ నుండి ప్రజాస్వామిక …
Read More »42 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. ఎమ్మెల్యే సీరియస్
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పింఛన్ పొందే అర్హత లేని ఓ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. నిండా యాభై ఏళ్లు కూడా లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను ధ్రువపత్రం తీసుకోవడానికి వచ్చిన మరికల్కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తిని చూసి షాకైన …
Read More »సీఎం కేసీఆర్ తో సీపీఎం నేతలు భేటీ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో తెలంగాణ సీపీఎం నేతలు సమావేశమయ్యారు. కేసీఆర్తో సమావేశమైన వారిలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు ఉన్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నిక, రాజకీయ అంశాలతో పాటు బీజేపీ వైఖరిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే త్వరలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి సీపీఎం మద్దతు …
Read More »కోటి రూపాయలతో సీసీ రోడ్డు పూర్తి చేయించిన ఎమ్మెల్యే Kp కు కృతజ్ఞతలు తెలిపిన సంక్షేమ సంఘం సభ్యులు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ ఫేస్-2 కాలనీకి చెందిన సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో సుమారు కోటి రూపాయలతో నూతనంగా సీసీ రోడ్డు అభివృద్ధి చేయించిన సందర్భంగా కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు …
Read More »కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్
నిన్న శుక్రవారం తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో పర్యటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిర్మల వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేంద్రం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో తెలంగాణ వాటా ఉందని పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ రూపాయి ఇస్తే.. కేంద్రం నుంచి రాష్ట్రానికి 46 పైసలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని పీడీఎస్ దుకాణాల …
Read More »కామారెడ్డిలో మంత్రి నిర్మలా సీతారామన్
తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం బాన్సువాడకు చేరుకున్న కేంద్రమంత్రి మండలంలోని కొయ్యగుట్ట అమరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. ఆపై బాన్సువాడ పట్టణంలోని బీజేపీ కార్యకర్త తుప్తి ప్రసాద్ ఇంట్లో నిర్మల సీతారామన్ అల్పాహారం చేశారు. లోక్సభ ప్రవాస్ యోజనలో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్రమంత్రి పర్యటిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో రేషన్ …
Read More »నిఘా నేత్రాలతో నేరాల నియంత్రణ-MLA Kp
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని చంద్రానగర్ లో కాలనీవాసుల సౌజన్యం రూ.5 లక్షలు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు రూ.2 లక్షల ఆర్థిక సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన 60 సీసీ కెమెరాలను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు, బాలానగర్ ఏసీపీ గంగారాం గారితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే Kp కృషి…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ సందర్భంగా సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »తెలంగాణలో సొంత జాగా ఉన్నవాళ్లకు Good News
తెలంగాణలో సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. వారికీ రూ.3లక్షలు పంపిణీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దసరా పండుగ తర్వాత ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. కరోనాతో గత రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల ఈ పథకాన్ని ప్రారంభించలేకపోయాం . దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించాం’ అని గజ్వేల్ (మ) శేరిపల్లి గ్రామాల్లో డబుల్ …
Read More »యాదాద్రిలో ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఈ రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి వేదాశీర్వచనం అందించారు.. ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు. ఎమ్మెల్సీ వెంట ఎంపీపీ నారాయణరెడ్డి, నర్సింహారెడ్డి, చిన్నంరెడ్డి, గోవింద్ …
Read More »