తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత ఈ రోజు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్లో ఐటీ పార్క్ ఏర్పాటు గురించి ఇరువురు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రూ.50 కోట్లతో నిజామాబాద్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఇప్పటివరకూ 60 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయని, వచ్చే దసరాకు ఐటీ పార్క్ ప్రారంభించేలా చర్యలు …
Read More »సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో 2,718 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ చేయడానికి దస్త్రంపై సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీధర్ సంతకం చేశారు. 2016, డిసెంబర్ 31 నాటికి తగిన హాజరు శాతం గల ఈ కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామనీ, ఒకట్రెండు రోజుల్లో వీటిని కార్మికులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొత్తం 2,718 …
Read More »ఢిల్లీలో తెలంగాణ మహిళపై అత్యాచారం
న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ మేనేజర్ సుభాష్ తనపై అత్యాచారం చేసి ఆస్తి రాయించుకున్నాడని ఆరోపిస్తూ ఓ తెలంగాణ మహిళ(32) అక్కడి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్కు సుభాష్ అనే యువకుడు మేనేజర్. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ ఒకరు 14సంవత్సరాలుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు పనిమనుషులు కూడా అందులో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో మాయ మాటలు చెప్పి సుభాష్ ఆమెను …
Read More »పేదలకు పెన్నిధి సీఎం రిలీఫ్ ఫండ్…ఎమ్మెల్యే దాస్యం
ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయి..ఆయా నియోజకవర్గాల్లో సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకున్న వారికి స్థానిక ఎమ్మెల్యే ద్వారా ఆర్థిక సాయానికి సంబంధించి చెక్లు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ నేపద్యంలోఈ రోజు వరంగల్ పశ్చిమ శాసనసభ సభ్యులు దాస్యం వినయ …
Read More »కేంద్రమంత్రికి మంత్రి హరీష్రావు లేఖ…!
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు . నీటి విడుదల విషయంలో బోర్డు సమర్థంగా పని చేయకపోగా పక్షపాత ధోరణి అవలంభిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద వివరాలను తారుమారు చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. నీటి విడుదలలో పక్షపాతంతో పాటు టెలీమెట్రీ ఏర్పాటులో ఆలస్యం చేస్తుందని ఫిర్యాదు …
Read More »రైతు బజార్ను సందర్శించిన హరీష్..!
సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేట వెళుతున్న మంత్రి హరీశ్రావు మర్కూక్ మండలం పాతూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మోడల్ కూరగాయల రైతు బజార్ను సందర్శించారు. మంత్రి హరీష్ రావు వెంట మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహదారు వివేక్, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. మోడల్ మార్కెట్ రూపకల్పన ఎలా జరిగిందన్న విషయాన్ని హరీశ్ రావు వివేక్కు వివరించారు. మార్కెట్లో సౌకర్యాలు, గిరాకి …
Read More »మందుబాబులకు శుభవార్త…!
మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై ఉన్న నిబంధనలు కొంత మేరకు సడలించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. డ్రంకెన్ డ్రైవ్ లో చిక్కి, కౌన్సెలింగ్ కు హాజరు కాని వారి సంఖ్య కొన్ని వేలల్లో ఉంటుండగా, వారి వాహనాలన్నీ ట్రాఫిక్ పోలీసు స్టేషన్లలో కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. వాటి సంరక్షణ భారం పోలీసుశాఖా కి తలనొప్పిగా మారింది . కొత్త విధానాన్ని రూపొందించాలని యోచిస్తున్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏవీ రంగనాథ్ …
Read More »సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్
సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని దుద్దేడ శివారులో సీఎం కేసీఆర్ 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు కలెక్టరేట్,పోలీస్ కమిషనరీట్ కార్యాలయాల భవన సముదాయంకు శంఖుస్తాపన చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి,అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిిన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు..
Read More »నారాయణమూర్తికి మరో పురస్కారం
పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కొమురం భీమ్ అవార్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నారాయణమూర్తికి రామినేని ఫౌండేషన్ అవార్డును ప్రకటించింది. అమెరికాకు చెందిన ప్రఖ్యాత డాక్టర్ రామినేని ఫౌండేషన్ విశిష్ట పురస్కారాలను వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అందజేస్తారు. ఈ రామినేని విశిష్ట పురస్కారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరిని వరించింది. అంతేకాక ప్రొ.గీతా కె. వేముగంటి, సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి …
Read More »బీజేపీ బలోపేతం..ఓ అందమైన కల అంటున్న మంత్రి కేటీఆర్
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరణ గురించి బీజేపీ ప్రణాళిక వేయడం గురించి మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన రీతిలో స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి కేటీఆర్ అనేక అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీ విస్తరణ గురించి సదరు జర్నలిస్ట్ ప్రస్తావించడంతో…‘కలలు కనడంలో తప్పేం లేదు. బీజేపీ నేతలు తమది తాము జాతీయ పార్టీగా భావించుకుంటున్నప్పటికీ… దక్షిణాదిలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక్క కర్ణాటక మినహా మిగతా చోట్ల …
Read More »