తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం అద్భుతమని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శాసనమండలిలో కేసీఆర్ కిట్ పథకంపై చైర్మన్ స్వామిగౌడ్ చర్చ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ..కేసీఆర్ కిట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. గర్భిణీలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని స్పష్టం చేశారు. మగబిడ్డ పుడితే రూ. 12 వేలు, ఆడబిడ్డ పుడితే …
Read More »దేశంలో కేసీఆర్ ఒక్కరే..ఖలేజా ఉన్న సీఎం
దేశంలో ఖలేజా ఉన్న సీఎం కేసీఆర్ ఒక్కరేనని విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు.కార్తీక సోమవారం సందర్భంగా నవంబర్ 5న హన్మకొండ వేయిస్తంభాల గుడిలో ‘రుద్రేశ్వరుడి లక్ష బిల్వార్చన’ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి.. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల కోసం ఆయుత చండీయాగం చేసి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని కొనియాడారు.అనేక …
Read More »ఒక్కొక్క విద్యార్థిపై 41 వేల ఖర్చు పెడుతున్నాం.. కడియం
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 2016-17 విద్యాసంవత్సరానికి గానూ.. ప్రభుత్వ, లోకల్ బాడీ, కేజీబీవీ, మోడల్, రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు విద్యను అందించడానికి రూ. 10,130 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై రూ. 41,196 ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఉపాధ్యాయుల జీతాలు, సిబ్బంది వేతనాలు, పాఠశాలలో వసతుల కల్పన, టాయిలెట్స్ మెయింటనెన్స్, అదనపు తరగతి గదుల కోసం నిధులు …
Read More »నష్టపోయిన పత్తి రైతులను ఆదుకుంటాం..కేసీఆర్
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పత్తికి కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ సారి పత్తి రైతులకు మంచి మద్దతు ధర వస్తుందని ఆశిస్తున్నామని సీఎం చెప్పారు. మద్దతు ధర కోసమే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తున్నామని సీఎం …
Read More »పబ్లిసిటీ కోసం రక్కస్ చేయడం సరికాదు..సీఎం కేసీఆర్
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. శాసనసభలో బీజేపీ సభ్యులు నిల్చొని నిరసన తెలుపడంతో.. సీఎం కేసీఆర్ స్పందించారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందని.. ఆ క్రమంలో ప్రతీ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. శాసనసభలో తమ గొంతు వినిపించే అవకాశం లేని వారు ఛలో అసెంబ్లీకి పిలుపునిస్తారని సీఎం తెలిపారు. ఛలో అసెంబ్లీ అని వస్తే సీఎం …
Read More »షబ్బీర్ అలీకి మంత్రి కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్ ..
గత కొద్దిరోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చాలా అర్ధవంతంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా నిన్న సోమవారం శాసనమండలిలో మంత్రి కేటీరామారావు కాంగ్రెస్ ఎల్పీ నేత షబ్బీర్ అలీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు .నిన్న మండలిలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ “గతంలో ఇంటి నుండి అరగంటలో అసెంబ్లీకి వచ్చేవాళ్ళం . కానీ ఇప్పుడు గంటకుపైగా సమయం పడుతుంది .హైదరాబాద్ మహానగరంలో రోడ్లు అంత తీవ్రంగా దెబ్బ తిన్నాయి .ప్రజలు …
Read More »రైతులపై అక్రమ కేసులు పెట్టలేదు..అవి సక్రమ కేసులే..మంత్రి పోచారం
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం రైతులపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందన్నారు. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం స్పందించారు.రైతులపై ఎక్కడా అక్రమ కేసులు పెట్టలేదని మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మంలో రైతులపై అక్రమ కేసులు పెట్టలేదు.. అవి సక్రమ కేసులేనని తెలిపారు. కనీస మద్దతు ధర అడిగినదానికి రైతులపై కేసులు పెట్టలేదు. అక్కడ కార్యాలయంపై దాడి చేసి.. ఆస్తులను, మిషనరీని ధ్వంసం చేసినందుకు …
Read More »షబ్బీర్ అలీపై హోంమంత్రి నాయిని ఫైర్
శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నాయిని విమర్శించారు. కాంగ్రెస్ పాలకులు హైదరాబాద్ నగరాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. కాంగ్రెసోళ్లు 50 ఏళ్లు పాలించి తెలంగాణను లూటీ చేశారని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక మూడేళ్లలో హైదరాబాద్ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తున్నామని …
Read More »సభలో చర్చకు రాకుండా రచ్చకు రావడం ఏరకమైన నీతి..కేటీఆర్
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని చైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు కలిసి ఉద్యోగాల కల్పనపై చర్చకు చేపట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి సరఫరాపై ఉన్న ప్రశ్నను బీజేపీ వాయిదా వేసుకోవడం సరికాదన్నారు. …
Read More »రేవంత్ బాహుబలి కల..బక్రా చేసేసిన జానారెడ్డి
తెలంగాణలో అల్లకల్లోలం అయిపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా హల్ చల్ చేసి సునామీ సృష్టించాలని ఆకాంక్షించిన టీడీపీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేరికలకు ముందు హామీ ఇచ్చినట్లు పదవి కట్టబెట్టకపోగా…మరోవైపు ఆయన గాలి తీసేసేలా..కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత జానారెడ్డి రేవంత్ కలలను చిదిమేసేశారు. కాంగ్రెస్ పార్టీలోకి …
Read More »